Delhi-Jammu: బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం!

ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా అంబాలా ప్రాంతంలో మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా 20 మందికి పైగా గాయాలయ్యాయి.

New Update
Delhi-Jammu: బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం!

Road accident: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాలోని అంబాలా ప్రాంతంలో మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. యూపీ నుంచి జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు