Delhi-Jammu: బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం! ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా అంబాలా ప్రాంతంలో మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. By srinivas 24 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Road accident: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాలోని అంబాలా ప్రాంతంలో మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. యూపీ నుంచి జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. #delhi-jammu #road-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి