ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా?

IPL చెన్నైజట్టులో ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ధోనీ,సీఎస్కే సీఈవో తో పంత్ కు ఉన్నరిలేషన్ కారణమని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఇంటెర్నెట్ లో వస్తున్న పుకార్లను ఢిల్లీ మేనేజ్ మెంట్ ఖండించింది.

New Update
ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా?

CSK లెజెండ్ ధోని IPL మెగా వేలానికి ముందే రిటైర్ అవుతాడని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేనప్పటికీ, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు లేకపోవటంతో ఈ వార్తను సులభంగా అర్థం చేసుకోవచ్చు.అయితే చెన్నై జట్టులో ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రిషబ్ పంత్ గత కొన్నాళ్లుగా ధోనీతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. అదేవిధంగా, రిషబ్ పంత్ CSK జట్టు CEO సుందర్ రామన్‌ కు అత్యంత సన్నిహితుడు కూడా.దీంతో సీఎస్‌కే జట్టులో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

పంత్ ను CSK బదిలీ చేసేందుకు ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించారు. అయితే ఈ వార్తలను ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ ఖండించింది. ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ కు మధ్య రిలేషన్ బాగానే ఉందని, రిషబ్ పంత్ ను వదులుకునే ఆలోచన లేదని సమాచారం. ప్రకటన రిషబ్ పంత్, అక్షర్ పటేల్ పేర్లను ఢిల్లీ జట్టు అట్టిపెట్టుకునే జాబితాలో టాప్ 2 ప్లేయర్స్‌గా ఉంటారని వెల్లడించింది. అదేవిధంగా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను కూడా రిటైన్‌ చేసుకోవాలని ఢిల్లీ జట్టు భావిస్తోందని, దాని కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. జేక్ ఫ్రేజర్, ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరిలో ఒకరిని ఢిల్లీ జట్టు అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడైంది. కానీ వారి వేతనాల నిర్ణయంలో ఇబ్బందులు తలెత్తడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో సీఎస్‌కేకి రిషబ్‌ బండ్‌ వచ్చే అవకాశం లేకపోవడం ఖాయం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

New Update
Bhubharathi Portal

Bhubharathi Portal

Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.  

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

భూ స‌మ‌స్యల ప‌రిష్కారం, లావాదేవీల‌కు చెందిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్​ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్​ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్రజ‌ల నుంచి వ‌చ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండ‌లంలోనూ క‌లెక్టర్ల ఆధ్వర్యంలో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు.

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

 ప్రజలు, రైతుల‌కు అర్ధమ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్టల్ ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బ‌లోపేతానికి ప్రజ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యద‌ర్శి జ్యోతి బుద్ద ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన  

 రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment