Telangana Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 1890 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

నిరుద్యోగులకు శుభవార్త. మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అవ్వగా..ఇప్పుడు మరో 1890 పోస్టులతో 7094 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

New Update
Breaking: స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. గతేడాది డిసెంబర్ 30, 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి కొనసాగింపుగా మరో 1890 పోస్టులను కలిపి మొత్తం 7094పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక మండలి అనుమతి ఇచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ డైరెక్టరేట్ పరిధిలో వైద్యవిద్యాసంచాలక పరిధిలో 5,650 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 757 పోస్టులు , ఎంఎన్ జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో 81, దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో 8, మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 127, బీసీగురుకుల సంస్థ పరిధిలో 260 , గిరిజన గురుకుల సంస్థ పరిధిలో 74, ఎస్సీ గురుకుల సంస్థ పరిధిలో 124, తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో 13పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

కాగా ఇందులో జోన్ 1 పరిధిలో 937, రెండో జోన్ లో 1044 ఉండగా..మూడో జోన్లో 1023, నాలుగో జోన్లో 719, అయిదో జోన్లో 1305 , ఆరోజోనులో 948 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 2100 ఓసీ పోస్టులు ఉండగా...ఈడబ్ల్యూఎస్ 653, బీసీ ఎ 612, బీసీ బి 686, బీసీ సి 81, బీసీ డి 466, బీసీ ఇ 330, ఎస్సీ 1041,ఎస్టీ 690, స్పోర్ట్స్ కోటాలో 114, దివ్యాంగుల కోటాలో 311 పోస్టులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేస్తామని సర్కార్ పేర్కొంది.

నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ పాఠశాల మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 

శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలన్నారు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సమర్గ్ నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.

వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టండి: సీఎం రేవంత్ రెడ్డి
పోలీసు శాఖలో 8ఏళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలను చేపట్టాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య ఆరోగ్య అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం హోం గార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు.

9800 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని అధికారికంలోకి తీసుకువచ్చేందుకు సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి…ఇప్పుడు ప్రజా సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై ద్రుష్టి సారించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటి. గతంలో వాయిదా పడిన పరీక్షలు, కొత్త నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీఎస్సీపై కూడా త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ గుడ్ న్యూస్ చెప్పనుందట కాంగ్రెస్ సర్కార్. అతి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ తేదీని ప్రస్తావించారు. దీంతో ఈ నోటిఫికేషన్ కోసం డీఎస్సీ అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

రాష్ట్రంలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగాడీఎస్సీ సాధన పేరుతో హైదరాబాద్ దిల్ షుక్ నగర్ లో డిసెంబర్ 13వ తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొ. కోదండరాం పాల్గొని పలు కీలక విషయాలను ప్రస్తావించారు. గత సర్కార్ 10ఏళ్ల కాలంలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని..దాన్ని బలోపేతం చేసేందుకు అందరూ పాటుపడాలని తెలిపారు. అలాగే గతంలో మూసివేసిన ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తే..కనీసం 6వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని..అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం కూడా తగ్గుతుందని కోదండరాం తెలిపారు. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ ప్రతిపాదనలు కొనసాగుతున్నాయని చెప్పారు.

కాగా ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 20,740 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంటున్నారు. 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధం అయ్యింది గత ప్రభుత్వం. ఈ మేరకు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. ఎన్నికలు రావడంతో ఆ డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడింది. అయితే కొత్త సర్కార్ మాత్రం ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని పరిశీలిస్తుందట. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే రాష్ట్రంలో డీఎస్సీ పోస్టుల విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి మాత్రం మెగా డీఎస్సీ నిర్వహించి వేల సంఖ్యలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న పక్కా ప్లాన్ తో కాంగ్రెస్ సర్కార్ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అయితే గతంలో తీసుకున్న దరఖాస్తులతోనే నియామక పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే కొత్తగా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారా ? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి: ఇక నుంచి కేటరింగ్ కూడా చేయనున్న జొమాటో.. సంస్థ కొత్త వ్యూహం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు