AP : ఏపీలో మరో దారుణం.. ఒంటరిగా ఉంటున్న రిటైర్డ్ టీచర్ను.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉంటున్న లలితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. అమెరికాలో ఉన్న కుమారుడు ఆమెకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Prakasam : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ (Retired Teacher) దారుణ హత్యకు గురయ్యారు. పిల్లి లలిత హత్య చీరాల (Chirala) లో కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న లలితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. అమెరికా (America) లో ఉన్న కుమారుడు తల్లి లలితకు ఫోన్ చేస్తే.. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తల్లి ఉంటున్న వీధిలోని మరొకరికి ఫోన్ చేయగా.. స్థానికులు వచ్చి చూసే సరికి లలిత రక్తపు మడుగులో కనిపించింది. దీంతో ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లలిత డెడ్ బాడీని చూసిన పోలీసులు గతరాత్రి హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, దొంగతనానికి వచ్చి ఆమెను హత్య చేశారా? లేదా మరేదైనా కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులు.. గాంజా బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయంటున్నారు. లలిత హత్య గాంజా బ్యాచ్ (Ganja Batch) పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా వివారాలు సేకరించే పనిలో ఉన్నారు. Also Read : నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది! #america #prakasam-district #retired-teacher #chirala సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి