Solar Eclipse : సూర్య గ్రహణం వెనుక దాగిన కథనాలు.. తప్పక తెలుసుకోండి..!

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న రానుంది. దీని పై సైన్స్ ఒకవైపు, మతం మరో వైపు వాదులాడుకుంటుంటే.. ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి వాదన ఏంటి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Solar Eclipse : సూర్య గ్రహణం వెనుక దాగిన కథనాలు.. తప్పక తెలుసుకోండి..!

Solar Eclipse Story : తల పైకెత్తి చూస్తే నేనున్నాననే భరోసాతో మనకి ఆకాశం కనిపిస్తుంది.. ఆ ఆకాశం అనంత అద్భుతాలకు నిలయం.. అంతరిక్షం(Space), గ్రహాలు, నక్షత్రాలు లాంటివాటిపై మానవుడి ఆసక్తి ఈనాటిది కాదు. ఈ విశ్వం గుట్టు విప్పేందుకు ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలనే పణంగా పెట్టారు. అంతుచిక్కని విశ్వం రహస్యాలను ఛేదించేందు సైంటిస్టులు తమ మెదళ్లకు సాన పెడితే మరోవైపు మతం ప్రతీ అద్భుతాన్ని దేవుడికి అంకితం చేసింది. ఇలా సైన్సు, మతం మధ్య ఉన్న వైరం వేల ఏళ్ల నాటిది. ఈ యుద్ధం గ్రహనాల సమయంలో బయటపడుతుంది.

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం(Solar Eclipse) ఏప్రిల్ 8న రానుంది. దీని పై సైన్స్ ఒకవైపు, మతం మరో వైపు వాదులాడుకుంటుంటే.. ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి వాదన ఏంటి అనేది తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

సూర్య గ్రహణం అంటే?

సూర్యుడు(Sun), చంద్రుడు(Moon), భూమి ఒకే సరళరేఖ(Straight Line) పైకి వచ్చినప్పుడు సూర్య గ్రహణం సంభవిస్తుంది. అంటే సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వస్తాడు. ఆ సమయంలో సూర్యుడు భూమిపై ఉన్నవారికి కనిపించడు. దీన్నే సూర్య గ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని అడ్డుకునే భాగం ఆధారంగా పాక్షిక సూర్య గ్రహణం, సంపూర్ణ సూర్య గ్రహణం, రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడుతాయి. రింగ్ ఆఫ్ ఫైర్ 5 నిమిషాల పాటు కనిపిస్తుంది.

Solar Eclipse

సంప్రదాయవాదులు ఏం చెబుతారు?

రాహువు, కేతువు అనే గ్రహాలు సర్ప రూపంలో సూర్య, చంద్రులని మింగేయడం వలన గ్రహణాలు ఏర్పడతాయన్నది కొందరి సంప్రదాయవాదుల వాదన. పాములు వచ్చి, సూర్య చంద్రులని మింగడం వలన గ్రహణం వస్తుందని నమ్మేవారు ఉన్నారు. ఈ సమయంలో గర్భిణిలకు చాలా నియమాలను చెబుతుంటారు. గ్రహణం వేళ భోజనం చేయకూడదన్నది చాలా మంది చెప్పే మాట. గ్రహణం చూస్తే అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో బయటకి రారు.

హేతువాదులు ఏం చెబుతారు?

సూర్యుడు చంద్రుడు భూమి ఒకదాని చట్టూ ఒకటి తిరిగే క్రమంలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడతాయని హేతువాదులు పదేపదే చెబుతుంటారు. నిజానికి గ్రహణం వల్ల ఎలాంటి అనర్థాలు, అద్భుతాలు జరగవన్నది సైన్స్ మాట. అందుకే గ్రహణం రోజు హేతువాదులు బహిరంగంగా భోజనం చేస్తుంటారు. గ్రహణాలు సర్వసాధారణమని ..వాటి వల్ల ఎలాంటి కీడు జరగదని చెప్పే ఉద్దేశ్యమే ఇది. ఇలా గ్రహణానికి మతం, సైన్స్ ఎవరి వాదన వారు వినిపించుకుంటున్నారు. ఇక వీటితో సంబంధం లేని ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది.

Also Read : Jr NTR: RTO కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసమే వెళ్లారట..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

పాకిస్తాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. 64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వలన పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.

New Update
india

Indus River

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.  పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ...ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది. 

పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది.  ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు. ఈరోజు ఉదయం నుంచీ రక్షణశాఖ, క్యాబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది.  పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్ లో ఉ్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి . 

సింధూ జలాల ఒప్పందం...

సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంక ఉపేక్షించేదే లేదంటూ సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్. 

ఎడారిగా మారనున్న పాక్..

ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు.  ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది.  అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.    

ఏమిటీ ఒప్పందం..?

సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.  దీని ప్రకారం భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లపై, పాకిస్తాన్‌కి పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధూ నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై రెండు దేశాల ఒప్పందం చేసుకున్నాయి.  ఈ ఒప్పందం వల్ల సింధూ జలాల్లో  80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఇంతకు ముదు కడా చాలా సార్లు ఈ షింధూ జలాల ఒప్పందం వివాదాస్పదం అయింది. దీని వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధూ జలాలను కట్ చేసి పారేసింది. 

today-latest-news-in-telugu | pakistan | sindhu | river

Also Read: BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు