Xiaomi నుంచి మరో దుమ్ములేపే స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ.7 వేలే..!

రెడ్ మీ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇటీవల లాంచ్ అయిన REDMIA3x అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 3GB RAM+64GB వేరియంట్ ధర రూ.6,999 కాగా.. 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ.7,999 మాత్రమే.

New Update
Xiaomi నుంచి మరో దుమ్ములేపే స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ.7 వేలే..!

Xiaomi సబ్-బ్రాండ్ Redmi భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది ఎంట్రీ లెవల్ బడ్జెట్‌లో వస్తుంది. కంపెనీ ఈ ఏడాది జూన్‌లో రెడ్‌మి ఎ3ఎక్స్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది కంపెనీ A-సిరీస్‌కి చెందిన బడ్జెట్ ఫోన్. ఇందులో మీకు సరికొత్త ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ లభిస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5000mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా, మరెన్నో ఫీచర్లతో అందుబాటులో విడుదల చేసింది. దాని వివరాలు తెలుసుకుందాం.

ధర ఎంత?

Redmi A3x రెండు కాన్ఫిగరేషన్లలో లాం చేసింది రెడ్ మీ. 3GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999. మరోటి దీని 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,999కి లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, స్టార్రీ వైట్ మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. దీనిని అమెజాన్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు .

స్పెసిఫికేషన్స్ ఏమిటి?

Redmi A3x 6.71-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T603 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 4GB RAM, 128GB నిల్వ ఎంపికను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. దీనికి ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. స్మార్ట్‌ఫోన్‌కు శక్తినివ్వడానికి, 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ అందుబాటులో ఉంది. ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు