Rape case: తెలంగాణలో మరో దారుణం.. మద్యం తాగించి మహిళా కూలీలపై అత్యాచారం!

తెలంగాణ నాగర్ కర్నూలో జిల్లాలో ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి వినోద్‌ సింగ్, గజానంద సింగ్‌ అనే వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పని ఉందని తీసుకెళ్లి నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్‌ తెలిపారు.

New Update
Rape case: తెలంగాణలో మరో దారుణం.. మద్యం తాగించి మహిళా కూలీలపై అత్యాచారం!

Nagarkurnool: తెలంగాణలోని నాగర్ కర్నూలో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలో బండల దుకాణాలు నిర్వహించే వినోద్‌ సింగ్, గజానంద సింగ్‌ తమ ఇంట్లో పని ఉందని కూలీ మాట్లాడుకొని మహిళలను తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంట్లో పని కోసం తీసుకెళ్లి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూర్‌ మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు అచ్చంపేటకు వచ్చి రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. గురువారం కూడా వారు పని కోసం వచ్చారు. ఈ క్రమంలోనే వినోద్‌ సింగ్, గజానంద సింగ్‌ తమ ఇంట్లో పని కోసం తీసుకెళ్లి ఇంటిని శుభ్రం చేయించుకున్నారు. పని అయిపోగానే ఇద్దరినీ నమ్మించి మధ్యాహ్నం 3 గంటలకు కారులో ఎక్కించుకుని నల్గొండ జిల్లా డిండి వైపు తీసుకెళ్లి మద్యం తాగించారు. అనంతరం శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌ శివారు ప్రాంతంలో కారు నిలిపి మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. సాయంత్రం 6 గంటలకు అచ్చంపేట శివారులో వారిని వదిలేశారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్‌ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు