Maharashtra: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు

మహారాష్ట్రలో చిన్నారుల మీద లైంగిక వేధింపులు పాల్పడిన నిందితుడిని ఉరి తీసేంతవరకు ఒప్పుకునేది లేదంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధువులు. ఏడు గంటలుగా బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో పట్టాల మీద బైఠాయించి మరీ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.

New Update
Maharashtra: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు

Rail Roko: ప్రస్తుతం దేశం అంతా భావోద్వేగాలతో నిండి ఉంది. కోలకత్తా రేప్, మర్డర్ కేసు దేశాన్ని పట్టి కుదిపేసింది. దాన్నుంచే ఇంకా జనాలు బయటపడలేదు అంటూ...తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన అందరినీ కదిలిస్తోంది. ముఖ్యంగా బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు అయితే కోపంతో రగిలిపోతున్నారు. చిన్నారులపై ఇలాంటివి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించే వరకు ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపై ఏడు గంటలుగా మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లోని ట్రాక్స్ బైఠాయించారు. రైళ్ళ రాకపోకలను అడ్డుకుంటూ నిరసనలు చేస్తున్నారు.

మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇలా ఎంత మంది వచ్చినా తాము వినిపించుకునేదే లేదంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధువులు. నిందితుడిని కఠినంగా శిక్షించేవరకు కదిలేది లేదని పట్టుబట్టుకుని కూర్చొన్నారు. హ్యంగ్ హ్యాంగ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆరు గంటలకు పైగా కొనసాగుతోన్న రైల్‌ రోకోతో పలు లోకల్‌ రైళ్లు రద్దయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరసనకారుల డిమాండ్లకనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి గిరీశ్ చెప్పారు. అయినా ఆందోళనకారులు నిరసనల్ని విరమించలేదు. మరోవైపు ఈ ఘటనపై మహిళా ఐపీఎస్ నేతృత్వంలో విచారణ చేసేందుకు ఆదేశాలు చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్‌ అధికారిణి ఆర్తి సింగ్‌ను దర్యాప్తు అధికారిగా నియమించామని చెప్పారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా విచారించాలని, ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలని, విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముందు ఈ అంశాన్ని ఉంచాలనుకుంటున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు.

Also Read : బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్‌ టచ్‌ చేస్తూ.. బాలికల అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment