Rahul Gandhi: లడఖ్‎లో రాహుల్...బైక్ మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు..!!

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు లడఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ ఈరోజు లడఖ్ వెళ్లారు. శనివారం బైక్ పై రయ్ మంటూ లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్దుకు వెళ్లారు రాహుల్. దీనికి సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు రాహుల్ గాంధీ.

New Update
Rahul Gandhi: లడఖ్‎లో రాహుల్...బైక్ మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు..!!

Rahul Gandhi ladakh bike ride photos viral: నిత్యం పార్టీ సభ్యులతో సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా కనిపించే రాహుల్ గాంధీ..సడెన్ గా లఢఖ్ బైక్ యాత్ర చేపట్టారు. లఢఖ్ పర్యటనలో భాగంగా శనివారం పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళుతూ కనిపించారు. రాహుల్ గాంధీ బైక్ నడుపుతున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. మరికొన్ని ఫొటోలను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. " ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి" అనే క్యాప్షన్ ఇచ్చారు.

publive-image

గతంలో రాహుల్ గాంధీ రెండుసార్లు జమ్మూకశ్మీర్‌లో పర్యటించినా లడఖ్ వెళ్లలేకపోయారు. ఈ ఏడాది జనవరిలో రాహుల్ భారత్ జోడో పర్యటన సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు.


publive-image

దీని తర్వాత, ఫిబ్రవరిలో, అతను మరోసారి వ్యక్తిగత పర్యటన కోసం జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి యూరప్ టూర్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన పర్యటన మూడు దేశాలైన బెల్జియం, నార్వే, ఫ్రాన్స్‌లను కవర్ చేస్తుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యూరోపియన్ యూనియన్ ఎంపీలు, భారతీయ ప్రవాసులు, యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమవుతారని సమాచారం.

రాహుల్ గాంధీ ఈ ఏడాది మేలో అమెరికా పర్యటనకు వెళ్లారు.కాంగ్రెస్ నాయకుడు శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ DC, న్యూయార్క్ నగరాల్లోని భారతీయ ప్రవాసులు, వెంచర్ క్యాపిటలిస్టులు, చట్టసభల సభ్యులతో సంభాషించారు.

Also Read: సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్… మరోసారి సమన్లు పంపిన దర్యాప్తుసంస్థ….!

Advertisment
Advertisment
తాజా కథనాలు