Raghunandan Rao : ఎంపీ సీట్లను బేరానికి పెట్టారు.. బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌ రావు విమర్శలు

బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ సీనియర్‌ నేత రఘునందన్‌రావు. తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామంటూ కేటీఆర్, హరీశ్ రావు‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు.

New Update
Raghunandan Rao : ఎంపీ సీట్లను బేరానికి పెట్టారు.. బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌ రావు విమర్శలు

Raghunandan Rao Comments :  బీఆర్ఎస్(BRS) నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ(BJP) సీనియర్‌ నేత రఘునందన్‌రావు(Raghunandan Rao). తాము కాంగ్రెస్‌(Congress) తో కలిసి పనిచేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. హైదరాబాద్‌(Hyderabad) లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు

ఉద్యమకారుల పేరు వాడుకుని బీఆర్ఎస్ నేతలు వారికి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తప్పును ఒప్పుకొని తెలంగాణ(Telangana) అమరవీరుల స్థూపం వద్ద చెంపలేసుకొవాలని డిమాండ్‌ చేశారు. కష్టపడేవారికి బీఆర్‌ఎస్‌లో ఏనాడూ గుర్తింపులేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్లు ఇస్తామని కేటీఆర్‌, హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: బాలరాముడు అందరికీ దేవుడే.. జై శ్రీరామ్ అంటూ చైనా సైనికులు నినాదాలు..!!

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవుల్లో ఉంటూ వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్న అధికారులకు రాజకీయపరమైన పదవులు కట్టబెట్టారని, సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే ఆలోచనలోనే ఆ పార్టీ నాయకులు ఉన్నారని విమర్శలు కురిపించారు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌, బీజేపీ భిన్నమైన పార్టీలని, బీఆర్‌ఎస్‌ కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అహంకారం వల్లే బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు దూరమయ్యారని, అయినా వారి తీరు మారడం లేదని అని రఘనందన్‌రావు అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన.

New Update
Nidadavole Police Station

Nidadavole Police Station

AP Crime News : ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలులోని ఎంవీనగర్ దానమ్మ గుడివద్ద గల లలితదేవి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12,50,000 విలువ చేసే బంగారంతో పాటు రూ.10000 నగదు చోరికి గురైంది. లలితదేవి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పాటు నగలు చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి క్లూస్ సేకరించారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

కాగా పోలీసులు అన్ని రకాలుగా విచారించి చోరి చేసింది లలితాదేవి చెల్లెలే అని నిర్ధారించారు. ఇటీవల నిడదవోలులోని అక్క ఇంటికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శైలజ అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్భిద్ది పుట్టింది. దీంతో మరో రోజు పగడ్భందిగా ప్లాన్ చేసింది. చేసి అక్క బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరో ఇద్దరు సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా చెల్లెలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment