Tirupathi: తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు.. ప్రహ్లాద్‌ ను చంపింది గంజాయి మత్తే!

తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్‌ మరణానికి గంజాయి మత్తే కారణమని పోలీసులు తెలిపారు. సింహాం దగ్గరకు వెళ్లేముందు ప్రహ్లాద్‌ గంజాయి సేవించినట్లు విచారణలో వెల్లడించారు.

New Update
Tirupathi: తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు.. ప్రహ్లాద్‌ ను చంపింది గంజాయి మత్తే!

Tirupati Zoo Park Incident: తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. మద్యం మత్తులోనే ప్రహ్లాద్‌ (Prahlad) సింహానికి బలైనట్లు వార్తలొస్తుండగా తాజాగా పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టారు. సింహాం దగ్గరకు వెళ్లేముందు ప్రహ్లాద్‌ గంజాయి సేవించినట్లు గుర్తించారు. అంతేకాదు ప్రహ్లాద్‌ మానసిక స్థితి బాగోలేదని గుర్తించినట్లు వెల్లడించారు.

గంజాయి మత్తులోనే ఆలయ సిబ్బందిపై దాడి..
ఈ మేరకు రాజస్థాన్‌కు చెందిన 38 ఏళ్ల ప్రహ్లాద్ గుర్జర్‌ మరణానికి ముందు ప్రవర్తన తీరు గురించి పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రహ్లాద్ గంజాయి మత్తులోనే వేణుగోపాలస్వామి ఆలయ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలిపారు. టికెట్ విషయంలో కౌంటర్ దగ్గరున్న వ్యక్తితోనూ గొడవపెట్టుకున్నపుడు కూడా గంజాయి మత్తులోనే ఉన్నాడని, హాథీరాంజీ మఠం సిబ్బంది డయల్‌ 100కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయగానే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే ప్రహ్లాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక ఒంటరిగా తిరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే కౌన్సిలింగ్‌ నిర్వహించిన తర్వాత ప్రహ్లాద్‌ను తిరుపతిలో  (Tirupati) వదిలి వెళ్లినట్లు పోలీసులు వివరించారు.

ఇది కూడా చదవండి: AP: పార్టీ మారిన 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?

సిబ్బంది చెప్పినా వినకుండా..
ఇదే క్రమంలో మరుసటి రోజు ఎస్వీ జూకు వెళ్లిన ప్రహ్లాద్‌ గంజాయి మత్తులోనే ఉన్నాడని, అదే మైకంలో సింహం ఎన్‌క్లైజర్‌లోకి ప్రవేశించినట్లు చెప్పారు. గుర్జర్‌ గురువారమే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది చెప్పినా వినకుండా సింహాల ఎన్‌క్లోజర్‌ వైపు వెళ్లాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్‌ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అంతటితో ఆగకుండా వంద మీటర్ల దూ­రంలో ఉన్న సింహా­న్ని చూసి గట్టిగా అరిచాడు. జూలో మూడు సింహాలుండగా దుంగాపూర్‌ అనే సింహం తన వైపు చూడగానే తొడగొట్టి రెచ్చగొట్టాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించగా అతనివైపు వేగంగా పరిగెత్తుకొచ్చింది. దీంతో ప్రహ్లాద్ భయంతో ఉలిక్కిపడి పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్‌ గుర్జర్‌ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం తీసుకెళ్లి హతమార్చిందని వివరించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment