సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు బీజేపీ నేత ఏకగ్రీవం!

పంజాబ్ రాష్ట్రంలో సర్పంచ్ పదవిని వేలం వేయడం చర్చనీయాంశమైంది. అక్టోబరు 15న ఎన్నికలు జరగనుండగా హర్దోవల్‌ కలన్‌ గ్రామ సర్పంచ్‌గా స్థానిక బీజేపీ నేత ఆత్మాసింగ్‌ రూ.2 కోట్లకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. దీపిపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.  

New Update
derererr

Sarpanch Election: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సర్పంచ్ సీటు కోసం ఇప్పటికే పలువురు నాయకులు పావులు కదుపుతుండగా పలు స్థానాలు ఏకగ్రీవమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే పంజాబ్ రాష్ట్రంలో సర్పంచ్ పదవిని వేలం పాట వేయడం చర్చనీయాంశమైంది. 

అక్టోబరు 15న ఎన్నికలు..

ఈ మేరకు పంజాబ్‌ లో 13,237 సర్పంచ్ స్థానాలకు అక్టోబరు 15న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను సమర్పించేందుకు అక్టోబరు 4వ తేదీ తుది గడువు. పోలింగ్‌ ముగిసిన తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలోనే గురుదాస్‌పుర్‌లోని హర్దోవల్‌ కలన్‌ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం పాట నిర్వహించారు. మొదట రూ.50లక్షలతో మొదలైన వేలంగాపాట కోట్ల రూపాయలకు చేరుకుంది. అక్కడి స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మాసింగ్‌ ఏకంగా రూ.2 కోట్లకు సర్పంచ్ సీటు సొంతం చేసుకున్నాడు. గ్రామానికి నిధులు ఎక్కువగా తీసుకొచ్చేవారే సర్పంచ్ పదవికి అర్హులని, అలాంటి వారినే ప్రజలు ఎన్నుకుంటారని ఈ సందర్భంగా ఆత్మాసింగ్ చెప్పారు.

ఈ ఎన్నిక అధికారికం కాదు..

అయితే ఈ వేలం పాట తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఎన్నిక అధికారికం కాదు. ఇది బహిరంగ అవినీతి. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షించాలంటూ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్‌ ఆదేశించగా సర్పంచి ఎన్నికకు ఆత్మాసింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక పంజాబ్ లో సర్పంచ్ పదవి వేలం వేయటం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు బఠిండాలోని గెహ్రి బత్తార్‌ గ్రామంలో సర్పంచ్ పదవి రూ.60 లక్షలు పలికినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment