Andhra Pradesh : ఏపీలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఎక్కడంటే

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం అమీన్‌ నగర్ వద్ద పాడుబడ్డ షెడ్డులో కొందరు మద్యం బాటిళ్లు నిల్వఉంచారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 418 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఏ పార్టీకి చెందినవో తెలియాల్సి ఉంది.

New Update
Andhra Pradesh : ఏపీలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఎక్కడంటే

Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అనేక చోట్ల భారీ ఎత్తున నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. తాజాగా బాపట్ల(Bapatla) జిల్లా చిన్నగంజాం మండలం అమీన్‌ నగర్ వద్ద పాడుబడ్డ షెడ్డులో కొందరు మద్యం బాటిళ్లు(Liquor Bottles) నిల్వఉంచారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 418 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఓటర్లకు(Voters) పంచేందుకే గోవా, తెలంగాణ నుంచి భారీగా అక్రమ మద్యం దిగుమతి అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ మద్యం బాటీళ్లు ఏ పార్టీకి చెందినవి అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Also read: నందిగామలో టీడీపీ భారీ ర్యాలీ.. మద్దతుగా హిరో శివాజీ ఎన్నికల ప్రచారం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు