/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-8-jpg.webp)
PM Modi Post On Landslides In Kerala Incident : కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనపై మోదీ (PM Modi) స్పందించారు. వయనాడ్ జిల్లా (Wayanad District) లోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన అందిస్తామని చెప్పినట్లు తెలిపారు.
Distressed by the landslides in parts of Wayanad. My thoughts are with all those who have lost their loved ones and prayers with those injured.
Rescue ops are currently underway to assist all those affected. Spoke to Kerala CM Shri @pinarayivijayan and also assured all possible…
— Narendra Modi (@narendramodi) July 30, 2024
పరస్పర సహకారంతో ముందుకు సాగమని సహాయక బృందాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేరళ (Kerala) సీఎం పినరయి విజయన్ తెలిపారు. ప్రభుత్వ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షించాలని అన్నారు. కొండ చరియలు విరిగిపడిన వార్త విని ఆవేదనకు గురయ్యానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
Also Read : పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్ప్రెస్…ఏడుగురు మృతి..60 మందికి