PM Modi : కొండచరియలు విరిగిపడిన ఘటనపై మోదీ పోస్ట్

వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు మోదీ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేరళ సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు.

New Update
PM Modi: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?

PM Modi Post On Landslides In Kerala Incident : కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనపై మోదీ (PM Modi) స్పందించారు. వయనాడ్ జిల్లా (Wayanad District) లోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన అందిస్తామని చెప్పినట్లు తెలిపారు.

పరస్పర సహకారంతో ముందుకు సాగమని సహాయక బృందాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేరళ (Kerala) సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. ప్రభుత్వ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షించాలని అన్నారు. కొండ చరియలు విరిగిపడిన వార్త విని ఆవేదనకు గురయ్యానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.

Also Read : పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్‌…ఏడుగురు మృతి..60 మందికి

#landslides #pm-modi #wayanad-district #kerala
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు.....

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment