Flight Accident: కుప్పకూలిన విమానం...తెలియని ప్రయాణికుల జాడ!

థాయ్‌లాండ్‌ లో విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

New Update
Airlines : విమానంలో అలాంటి పని చేసినందుకు మహిళకు రూ.68 లక్షల జరిమానా!

Flight Accident: థాయ్‌లాండ్‌ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. థాయ్‌లాండ్‌ లోని చాచోంగ్‌సావోలోని అడవిలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బందితో వెళ్తున్న విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా...లేక ఇంకేమైనా జరిగిందా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు.

విమానం బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి ట్రాట్ ప్రావిన్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. థాయ్‌లాండ్‌లోని తూర్పు ప్రావిన్స్‌లోని చాచోంగ్‌సావోలో గురువారం టూరిస్టులతో విమానం బయల్దేరింది. కొద్దిసేపటికే విమానం కూలిపోయినట్లు సమాచారం అందడంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. పర్యాటకులు జాడ కోసం వెతుకుతున్నట్లు స్థానిక మీడియా వివరించింది.

Cessna Caravan C208 విమానం. థాయ్ ఫ్లయింగ్ సర్వీస్ ఫ్లైట్ నంబర్ TFT 209. బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌తో గాలిలోకి లేచిన కొద్ది సేపటికే సంబంధాన్ని కోల్పోయింది. విమానం ఆగ్నేయ ట్రాట్ ప్రావిన్స్‌కు వెళుతుండగా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:18 గంటలకు కూలిపోయింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందని అధికారులు వివరించారు.

Also Read: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు… ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫతేగంజ్‌లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.

New Update
Woman kills husband

భార్యల వివాహేత సంబంధాల కారణంగా బలవుతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీరట్‌ సౌరవ్, అమిత్‌ల హత్య సంచలనంగా మరిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తాజాగా మరో హత్య ఇలాగే జరిగింది. ఓ మహిళ ఛాయ్‌లో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. తర్వాత ప్రియుడితో కలిసి భర్త కేహర్ సింగ్ గొంతునొక్కి హత్య చేసింది. మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీసి ఉరేసుకున్నట్లు నమ్మించాలని ప్లాన్ వేసింది. కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం బయటపడింది. దీంతో భార్య రేఖను, ఆమె ప్రియుడు పింటూను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫతేగంజ్‌లో నివసిస్తున్న కేహర్ సింగ్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 16ఏళ్ల కింద అతనికి 25 ఏళ్ల రేఖతో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలున్నారు.

Also read: Azharuddin- HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం

ఆత్మహత్యగా చిత్రీకరించి..

రేఖకు పింటూతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కేహర్ సింగ్‌కు ఇది తెలియడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పూర్తిగా భర్త అడ్డును తొలగించుకొని ప్రియుడితో సెట్టిల్ అవుదామని ప్లాన్ వేసి భర్తను మర్డర్ చేసింది. ఏప్రిల్‌ 13న ఆదివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు పింటూను తన ఇంటికి పిలిచింది. వారిద్దరూ కలిసి గొంతు నొక్కి కేహర్‌ సింగ్‌ను హత్య చేశారు. అనంతరం భర్త మెడకు తాడు బిగించి సీలింగ్‌కు వేలాడదీశారు. ఏమి తెలియనట్లు సోమవారం తెల్లవారుజామున తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేఖ ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టింది. పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

పోలీసులు అక్కడికి చేరుకొని కేహర్‌ సింగ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గొంతు నొక్కి అతడ్ని చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో బయటపడింది. దీంతో రేఖను అదుపులోకి పోలీసులు ప్రశ్నించారు. ప్రియుడు పింటూతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్‌ ఆఫీసర్ తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. 

(Tags : Woman kills husband | Woman kills husband with boyfriend | poison | uttara-pradesh | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment