Plane Crash: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది!

నేపాల్‌లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్‌ అవుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

New Update
Plane Crash: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది!

Nepal : నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) లో విమానం కుప్పకూలింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ)లో సౌర ఎయిర్‌లైన్స్ విమానం కూలి (Plane Crash) మంటలు చెలరేగాయి. 19 మంది ప్రయాణికులతో పోఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో రన్‌వేపై నుంచి జారిపడిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

క్రాష్‌ అయిన సమయంలో విమానం నుంచి పెద్ద మంటలు చెలరేగడంతో పొగ బాగా కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితిని అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది కెప్టెన్‌ పాఖ్యను రక్షించారు.

Also Read: సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు!


Advertisment
Advertisment
తాజా కథనాలు