AP News : మా వర్గంలోకి రావొద్దు.. ముద్రగడకు షాక్ ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గం! పిఠాపురం రెడ్డి సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభంకు భారీ షాక్ ఇచ్చింది. రెడ్లలో చేరుతానంటూ ముద్రగడ చేసిన ప్రకటనను వ్యతిరేకించింది. ఈ మేరకు కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. By srinivas 10 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pithapuram : ముద్రగడ పద్మనాభంకు రెడ్డి (Mudragada Padmanabham Reddy) సామాజిక వర్గం షాక్ ఇచ్చింది. రెడ్లలో చేరుతానంటూ ముద్రగడ చేసిన ప్రకటనను వ్యతిరేకించింది. ఈ మేరకు కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి (Karri Venkatrami Reddy) ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 'అయ్యా పద్మనాభంగారు మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా మీకు అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందు చేరాలనుకుంటున్నారు? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరాలని ప్రకటించి నాలుగు రోజులు అయినా.. కొత్త ఆంధ్రా రెడ్డి సంఘ సభ్యులు ఎందుకు స్పందించలేదని రెడ్డి సంఘస్తులు ప్రశ్నిస్తున్నారు. గౌరవంగా బతికే రెడ్లు.. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటున్నారు. వారిని చేర్చుకోవలసిన అవసరం మనకు ఏమిటి? ఇలాంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘ సభ్యులుగా మీకు ఉన్నది. ఇప్పటికైనా సంఘ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవటం లేదని ఒక ప్రకటన చెయ్యాలి. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లులో చేరటాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సభ్యుడుగా నేను వ్యతిరేకిస్తున్నా' అంటూ లేఖలో పేర్కొన్నారు. Also Read : తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడికి దక్కిన శాఖలివే! #mudragada-padmanabha-reddy #pawan-kalyan #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి