Pawan Kalyan: యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్.. అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు.

New Update
Pawan Kalyan: యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్.. అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

Pawan Kalyan To Attend Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ చేపట్టిన యువగళం ముగింపు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈనెల 20న పాదయాత్ర విజయోత్సవం సభకోసం టీడీపీ (TDP) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజున వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నాయని..తాను హాజరు కానని తొలుత పవన్ టీడీపీ నేతలకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ తో చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరువుతానని పవన్ (Pawan Kalyan) చెప్పారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం సభకు (Yuvagalam) హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఎల్లుండి యువగళం విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి..
దేశ విదేశాల నుంచి జనాలు ఈ సభకు వస్తున్నారని ఆయన తెలిపారు. విశాఖ ఏయూ మైదానంలో ఈ సభ నిర్వహించాలని అనుమతి కోరినట్లు వెల్లడించారు. రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చామన్న అచ్చెన్నాయుడు..ప్రభుత్వం VC పై ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా చేసిందని ఆరోపించారు. ఆర్టీసీ ఎవ్వరికి అయినా బస్సులు అద్దెకు ఇవ్వచ్చన్నారు. దానికి చార్జీలు కూడా తీసుకుంటారని తెలిపారు. వీటికి స్వయంగా నేనే అభ్యర్థించ్చానన్న అచ్చెన్నాయుడు..ప్రైవేట్ కాలేజీల వాహనాలు ఇస్తామన్నారని తెలిపారు. వారందరినీ ప్రభుత్వం బెదిరిస్తుందని...
జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా..సభ నిర్వహించి తీరుతామన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా పెద్ద ఎత్తున 5 లక్షల మంది ప్రజలు సభకు రాబోతున్నట్లు తెలిపారు.కార్యకర్తలు స్వచ్చందంగా రైళ్లు పెట్టుకొని రాయలసీమ నుంచి కూడా వస్తున్నారని...ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

కాగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నెలల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం విశాఖ జిల్లా ఆగనంపూడి దగ్గర ముగియనుంది. పాదయాత్ర ముగిసే సమయానికి లోకేశ్ మొత్తం 3,132 కి.మీ పూర్తి చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నామీకోసం పాదయాత్రను కూడా అగనంపూడి వద్దే ముగించారు. ఆ సెంటిమెంటుతోనే ఇప్పుడు లోకేశ్ కూడా తన పాదయాత్రను అక్కడే ముగిస్తున్నారు. ఈ క్రమంలో 20న నిర్వహించనున్న విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలక్రుష్ణ,టీడీపీ ఇతర ముఖ్యనేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారని సమాచారం.

ఇది కూడా చదవండి: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Also Read :  కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

  • Apr 16, 2025 09:34 IST

    హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

    హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

    ed



  • Apr 16, 2025 09:20 IST

    షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.

    sheikh Hasina
    sheikh Hasina

     



  • Apr 16, 2025 09:19 IST

    ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

    ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

    EC



  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment