Janasena: నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌..ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌!

నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. కందుల దుర్గేష్‌ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

New Update
Janasena: నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌..ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌!

Nidadavole MP Ticket to Kandula Durgesh : ఏపీలో పొత్తు రాజకీయాలు రోజురోజుకి బలపడుతున్నాయి. అలాగే టీడీపీ-జనసేన (TDP- Janasena) మధ్య టికెట్ల వార్‌ కు కూడా నెమ్మదిగా తెరపడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది.

కందులు దుర్గేష్‌ (Kandula Durgesh) ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పొత్తులో భాగంగా దుర్గేష్ రాజమండ్రి (Rajahmundry) రూరల్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. అయితే అక్కడ నుంచి బుచ్చయ్య చౌదరి ఉండడంతో పాటు బీజేపీతో పొత్తు కుదరడంతో నిడదవోలు నియోజకవర్గం నుంచి దుర్గేష్ పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.

చాలా కాలం నుంచి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వినిపిస్తుంది. జనసేన (Janasena) 24 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తున్న క్రమంలో తొలివిడతగా ఐదుగురు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. కందుల దుర్గేష్‌ తో ఇప్పుడు మరో అభ్యర్థిని ప్రకటించారు జనసేన అధినేత.

ఇటీవల పొత్తులో జనసేన – టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 99 ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించగా.. అందులో టీడీపీ 94 మంది, జనసేన 5 మందిని ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు (Chandrababu).. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో పవన్ కు షాక్ ఇచ్చారు.

3 ఎంపీ స్థానాలను రెండు స్థానాలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకూండా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఆస్కార్‌ వేదిక మీదకు బట్టలు లేకుండా వచ్చిన స్టార్‌ రెజ్లర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan - Mark Shankar: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment