Hyderabad and Charminar Express Robbed: ఆ రెండు రైళ్లే వారి టార్గెట్.. అర్థరాత్రి చొరబడి బీభత్సం సృష్టించిన దొంగలు

సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీ చేశారు. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌1, ఎస్‌2 బోగీల్లో దొంగతనం చేశారు. నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లు, ఆభరణాలను అపహరించారు. దీంతో తేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అలర్ట్ అయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. బంగారం చోరీకి సంబంధించి ప్రయాణికులు తమ వివరాలను పోలీసులకు వివరించారు. ఈ మేరకు కావలిలో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు ఫిర్యాదుతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు కూడా సమచారం ఇచ్చారు. చోరీ జరిగిన ప్రాంతం సమీపంలోని గ్రామాలు, తదితర ప్రదేశాలను గాలిస్తున్నారు.

New Update
Hyderabad and Charminar Express Robbed: ఆ రెండు రైళ్లే వారి టార్గెట్.. అర్థరాత్రి చొరబడి బీభత్సం సృష్టించిన దొంగలు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో, అలాగే సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైలులో చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి 1:20 గంటల నుంచి 1:50 మధ్య దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.

సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీ చేశారు. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌1, ఎస్‌2 బోగీల్లో దొంగతనం చేశారు.

నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లు, ఆభరణాలను అపహరించారు. దీంతో తేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అలర్ట్ అయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. గుడ్లూరు మండలం వీరేపల్లి దగ్గర ఈ చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారం పెద్ద ఎత్తున ఉంటుందని తెలుస్తోంది.

బంగారం చోరీకి సంబంధించి ప్రయాణికులు తమ వివరాలను పోలీసులకు వివరించారు. ఈ మేరకు కావలిలో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు ఫిర్యాదుతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు కూడా సమచారం ఇచ్చారు. చోరీ జరిగిన ప్రాంతం సమీపంలోని గ్రామాలు, తదితర ప్రదేశాలను గాలిస్తున్నారు.

దోపిడీ తీరు చూస్తుంటే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు. కాగా అంతకుముందు ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రాత్రివేళ ట్రైన్ లలో గార్డులు సెక్యూరిటీగా ఉంటారు. అయినప్పటికీ ఈ రైళ్లలలో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు