Parliament Suspension Row : సభలోనే లేడు.. కానీ సస్పెండ్‌ చేశారు.. ఇదేక్కడి వింత భయ్యా!

లోక్‌సభ నుంచి 14మంది ఎంపీలు సస్పెండైనట్టు ముందుగా కేంద్రం ప్రకటించింది. అయితే లోక్‌సభకు అసలు హాజరుకాని డీఎంకే ఎంపీ పార్థిబన్ పేరు కూడా లిస్ట్‌లో ఉంది. దీంతో డీఎంకే ఫిర్యాదు చేయగా.. పొరపాటును సరి చేసుకున్న కేంద్రం ఆయన పేరును లిస్ట్‌ నుంచి తొలగించింది.

New Update
Parliament Suspension Row : సభలోనే లేడు.. కానీ సస్పెండ్‌ చేశారు.. ఇదేక్కడి వింత భయ్యా!

Lok Sabha MP Suspension : పార్లమెంట్‌(Parliament)లో భద్రతా ఉల్లంఘనపై లోక్‌సభ(Lok Sabha)లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ టార్గెట్‌గా విరుచుకుపడ్డాయి. నిన్న(డిసెంబర్‌ 13) లోక్‌సభ సమావేశాల సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఇద్దరు యువకులు దూకారు. బెంచీలపైకి ఎక్కి స్మోక్ గన్‌లతో పొగను వ్యాపింపజేసిన విషయం తెలిసిందే. అటు పార్లమెంట్‌ ఆవరణలో మరో ఇద్దరు నిరసన చెప్పారు. వీరితో పాటు మరో వ్యక్తిని(మొత్తం ఐదుగురిని) ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్‌పై దాడిని ప్రతిపక్షాలు ఓవైపు ఖండిస్తూనే మరోవైపు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) ఈ ఘటనపై ఇప్పటివరకు ఏం మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాయి. లోక్‌సభలో ఇదే విషయాన్ని లేవనెత్తగా.. సభలో గందరగోళం నెలకొంది. దీంతో ముందుగా ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేసిన స్పికర్‌.. తర్వాత మరో 9మందిని... అంటే మొత్తం 14మందిని సస్పెండ్‌ చేశారు. అయితే ఈ 14మందిలో ఒక పేరును తప్పుగా ప్రకటించారని తెలుస్తోంది.


సభలోనే లేడు:
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు శీతాకాల సమావేశాల మిగిలిన కాలానికి లోక్‌సభ నుంచి సస్పెండైన 13 మంది ప్రతిపక్ష ఎంపీలలో డీఎంకే నాయకుడు ఎస్ఆర్ పార్థిబన్(SR Parthiban) పేరు కూడా ఉంది. అయితే నిజానికి ఇవాళ(డిసెంబర్ 14) సభలో ఆయన లేరే లేరు. 14మంది సస్పెండ్‌ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అది కూడా అధికారికంగానే కేంద్రం ఇలా చెప్పింది. అయితే పార్థిబన్‌ సభలో లేరన్న విషయాన్ని డీఎంకే హైలెట్ చేయగా.. పొరపాటును సరి చేసుకున్న కేంద్రం మొత్తం 13 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్‌ ఐనట్లు తెలిపింది. లోక్‌సభ నుంచి 13మంది ఎంపీలు సస్పెండ్ చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

కేంద్రం క్లారిటీ:
సస్పెండ్ చేసిన ఎంపీలలో ఎస్‌ఆర్ పార్థిబన్ సభలో లేరని.. ఆయన చెన్నైలో ఉన్నారని అని డీఎంకే ఎంపీలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పార్థిబన్‌ 'సిక్‌ లీవ్‌'లో ఉన్నారు. ఒక ఎంపీ పేరును చేర్చడంలో పొరపాటు జరిగిందని జోషి క్లారిటీ ఇచ్చారు. తప్పుగా పెట్టిన ఎంపీ పేరును తొలగించాలని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామన.. స్పీకర్‌ అందకు అంగీకరించారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఓవరాల్‌గా సస్పెండైన ఎంపీల సంఖ్య 14. 13 మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ సస్పెండ్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను రాజ్యసభ నుంచి మిగిలిన సెషన్లకు సభ చైర్మన్‌ సస్పెండ్ చేశారు. ఇక సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల్లో డీన్ కురియాకోస్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, బెన్నీ బెహనన్, వీకే శ్రీకందన్, మహ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కనిమొళి కరుణానిధి, కే సుబ్బరాయన్, ఎస్ ఆర్ పార్థిబన్, ఎస్ వెంకటేశన్, మాణికం ఠాగూర్‌ ఉన్నారు.

Also Read: పార్లమెంట్‌పై దాడి చేసిన వారి బతుకులు జైల్లోనే.. ‘ఊపా’తో పాటు మొత్తం పెట్టిన సెక్షన్ల లిస్ట్ ఇదే!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment