Olympics Winners : ఒలింపిక్స్ విజేతలకు డబ్బులే డబ్బులు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కాసుల వర్షం కురుస్తోంది. పతకాలు తెచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటూ సొంత రాష్ట్రాల ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.

New Update
Olympics Winners : ఒలింపిక్స్ విజేతలకు డబ్బులే డబ్బులు..

Paris Olympics Winners : పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో భారత అథ్లెట్లు ఈసారి డబుల్ డిజిట్‌లో పతకాలు తెస్తారని భావించారు. కానీ గ్యారంటీగా వస్తాయనుకున్నవి కూడా రాలేదు. అయితే అస్సలు ఊహించని వాటిల్లో పతకాలు తెచ్చుకుని ఆశ్చర్య పరిచారు భారత అథ్లెట్లు. ఏ మాత్రం అంచనాలు లేని వారు పతకాలు సాధించుకుని వచ్చారు. మొత్తంగా ఆరు మెడల్స్‌తో మెరిశారు. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. వీరికి ఆయా ప్రభుత్వాలు నగదు బహుమతులను ప్రకటించాయి.

స్టార్ షూటర్ మను బాకర్ (Manu Bhaker).. ఈమెకు రెండు పతకాలు వచ్చాయి. మొత్తంగా ఆరు మెడల్స్‌తో మెరిశారు. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా కూడా మను ఘనత వహించింది. అందుకే కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రూ.30 లక్షల రివార్డును మనుబాకర్‌కు ప్రకటించారు.

మనుతో కలిసి మిక్స్‌డ్ ఈవెంట్లో సరబ్‌జ్యోత్ సింగ్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. దీనికి గానూ ఇతను కేంద్ర క్రీడల శాఖ మంత్రి నుంచి 22.5 లక్షల రివార్డును అదుకోనున్నారు. దాంతో పాటూ హరియాణా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. కానీ సరబ్ జ్యోత్ సింగ్ దానిని తిరస్కరించారు. తాను ఇంకా ఆడాలనుకుంటున్నాని చెప్పారు.

ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కుశాలె (Swapnil Kusale) కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే రూ. కోటి బహుమతి ప్రకటించారు. అదికాక ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్న ఇతనిని సెంట్రల్‌ రైల్వేలో ప్రత్యేక అధికారిగా నియమించారు.

పురుషుల హాకీ జట్టు..
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది.ఫైనల్స్‌కు వెళతారని అనుకున్నా తృటిలో తప్పిపోయింది. కానీ కాంస్యంతో మెరిశారు . దీంతో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటారు. అందుకే జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది హాకీ ఇండియా. దాంతో పాటూ డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌కు ఒడిశా ప్రభుత్వం రూ. 4 కోట్ల నజరానా ఇవ్వనుంది. ఒక్కో సభ్యుడికి రూ. 15 లక్షలు, సపోర్ట్‌ స్టాఫ్‌కు రూ. 10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక హాకీ జట్టుకు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మన్‌ కూడా రూ. కోటి నగదు బహుమతి ప్రకటించారు.

ఒలింపిక్స్‌లో ఏకైక రజత పతకధారుడు జావెలిన్‌ త్రో ప్లేయర్ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra). ఇతని బహుమతుల గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా లేదు. కానీ భారీ ఆఫర్లే లైన్లో ఉన్నాయని తెలుస్తోంది. ఇక చివరగా ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకం గెలిచిన ఒకే ఒక్క ప్లేయర్ అమన్ సెహ్రావత్. ఇతని గురించి కూడా వివరాలు తెలియలేదు.

Also Read:  Hyderabad: ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. 20 మంది మృతి

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ పండగవేళ ఈ మహావిషాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Russia Attacks on Ukraine

Russia Attacks on Ukraine

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ పండగ వేళ ఆదివారం స్థానికులంతా ఓ చోటు చేరగా.. రెండు క్షిపణి దాడులు జరిగినట్లు చెప్పారు. పండగవేళ ఈ మహావిషాదం జరిగిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.       

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు ఆపేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్న సందర్భంగా ఈ దాడులు జరిగాయి. సుమీ నగరంపై జరిగిన ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. రష్యా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుందని.. ఈ దాడుల్లో నివాసాలు, విద్యాసంస్థలు, కార్లు ధ్వంసమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

అలాగే ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలంటూ డిమాండ్ చేశారు. రష్యా ఉగ్రచర్చలను కోరుకుంటుందని.. యుద్ధాన్ని లాగుతోందని ఆరోపణలు చేశారు. రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా శాంతిని నెలకొల్పడం అసాధ్యమన్నారు. మాస్కో విషయంలో చర్చలు దాడులను నిలువరించలేకపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ఓ ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో రష్యా పట్ల అలాంటి వైఖరే అవసరమని తెలిపారు. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

Also Read: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం

telugu-news | rtv-news | russia-ukraine-war | international 

Advertisment
Advertisment
Advertisment