Mahabubabad: మహబూబాబాద్లో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత్య ఇద్దరు పిల్లలను చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గార్ల మండలం అంకన్నగూడెంలో తల్లిదండ్రులు దేవి, అనిల్ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. By Vijaya Nimma 12 Apr 2024 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి Mahabubabad: ఇద్దరు పిల్లలను చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గార్ల మండలం అంకన్నగూడెంలో తల్లిదండ్రులు దేవి, అనిల్ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ విషాద ఘటనపై కారణాలు తెలియాల్సింది. మృతుల పిల్లలు లోహిత, జస్యితగా గుర్తించారు. ఈ విషద ఘటన తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబం మొత్తం తీవ్రమైన శ్లోకంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు: ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేకుంటే ఆర్థిక ఇబ్బందులున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: అమెజాన్ పార్సిల్లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ #mahabubabad సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి