Pakistan Cricket Team : పాపం టీమ్ పాకిస్థాన్.. ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. 

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. వరల్డ్ కప్ పోటీలలో పసికూన అమెరికా, భారత్ లపై ఓటమి.. పాక్ టీమ్ ను పెద్ద ఆపదలోకి నెట్టేశాయి. మొత్తం పాక్ టీమ్ పై వారి దేశంలో దేశద్రోహం కేసు పెట్టాడు ఒక లాయర్. డబ్బుకోసం దేశాన్ని పణంగా పెట్టారని ఆ లాయర్ ఆరోపించాడు. 

New Update
Pakistan Cricket Team : పాపం టీమ్ పాకిస్థాన్.. ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. 

Pakistan : పాక్ క్రికెట్ టీమ్‌కు, కష్టాలకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, గత ఏడాది కాలంగా ఈ టీమ్‌కు ఒకదాని తర్వాత మరొకటి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం జట్టు పేలవ ప్రదర్శన. గతేడాది జరిగిన ఆసియాకప్ నుంచి మొదలైన పాక్ జట్టు కష్టాల పరంపర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు, అలాంటి కొత్త సమస్య పాకిస్తాన్ జట్టు మెడకు చుట్టుకుంది, T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) లో USA, టీమిండియా (Team India) లపై దారుణ ఆటతీరు ప్రదర్శించడంతో బాబర్ జట్టుపై పాకిస్తాన్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. 

దేశద్రోహం కేసు..
Pakistan Cricket Team : నిజానికి ఈసారి ప్రపంచకప్ గెలిచే ఫేవరెట్ జట్లలో ఒకటైన పాకిస్థాన్ జట్టు అంచనాలకు మించి పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ముఖ్యంగా క్రికెట్ బేబీ అమెరికా, సంప్రదాయ ప్రత్యర్థి భారత్ పై పాక్ జట్టు ఓడిపోవడం అభిమానులను కలిచివేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బాబర్ టీమ్‌కి కొత్త సమస్య ఎదురైంది.  టీమ్ మొత్తం జైలుకు వెళ్లే ఆందోళనలో పడింది. కోచ్ - ఇతర సిబ్బందితో సహా ఆటగాళ్లందరిపై పాకిస్తాన్ న్యాయవాది దేశద్రోహం కేసు పెట్టారు. మొత్తం టీమ్ దేశానికి ద్రోహం చేసిందని లాయర్లు ఆరోపించారు.

నిషేధించాలని డిమాండ్‌
Pakistan Cricket Team పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలా నగరానికి చెందిన ఒక న్యాయవాది బాబర్ ఆజంతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపై దేశద్రోహం కేసు పెట్టారు. ఇందులో జట్టు ఆటగాళ్ల పేర్లు, కోచ్, ఇతర సిబ్బంది పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటి టీమ్‌పై లాయర్లు పలు తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ వార్తా ఛానల్ ప్రకారం, అమెరికా- భారత్‌ రెండిటి చేతిలో పాక్ టీమ్  ఓటములు తనను తీవ్రంగా బాధించాయని లాయర్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దేశ గౌరవాన్ని పణంగా పెట్టి కెప్టెన్ బాబర్ ఆజం దళం మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నదని న్యాయవాదులు ఆరోపించారు. అంతే కాదు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, అది పూర్తయ్యే వరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై నిషేధం విధించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నివేదిక ప్రకారం, ఈ దావాను కోర్టు కూడా ఆమోదించింది. ఈ కేసులో పాకిస్థాన్ జట్టు ఇప్పుడు జైలుకు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది.

Also Read: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 లో టీమిండియా ఎప్పుడు.. ఎక్కడ ఆడుతుంది?

రెండు మ్యాచుల్లోనూ..
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ తన ప్రచారాన్ని అమెరికాతో ప్రారంభించింది. అయితే తొలి మ్యాచ్‌లో పాక్‌ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టెక్సాస్‌లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, అమెరికా 159 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో 5 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై అమెరికా విజయం సాధించింది. న్యూయార్క్‌లో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. అప్పటి నుండి, మాజీ క్రికెటర్లతో సహా చాలా మంది పాకిస్తాన్ అభిమానులు తమ జట్టుపై చాలా కోపంగా ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు