Operation Smile: సంగారెడ్డిలో 66 మంది బాల కార్మికులకు విముక్తి

ఈ వారం సంగారెడ్డిలో చేపట్టిన 'ఆపరేషన్ స్మైల్-X'లో భాగంగా మొత్తం 66 మంది బాల కార్మికలకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. యజమానులపై 27 కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా మీ కంటపడితే 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

New Update
Operation Smile: సంగారెడ్డిలో 66 మంది బాల కార్మికులకు విముక్తి

Operation Smile – X : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక (Child labor) వ్యవస్థ ఒకటి. కనీస అవసరాలు తీర్చుకోలేని దీన స్థితిలో ఉన్న చాలా కుంటుంబాలు బడికి వెళ్లాల్సిన తమ పిల్లలను బాల్యంలోనే పనుల్లో చేర్పిస్తున్నారు. అయితే తెలంగాణలో నెల రోజుల క్రితం వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి గొప్ప కార్యక్రమం చేపట్టారు. దానిపేరే 'ఆపరేషన్ స్మైల్– X'. (Operation Smile – X)ఈ ఆపరేషన్ లో భాగంగా 5 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా గుర్తించి వారి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కాపాడటమే.

అయితే ఇందులో భాగంగా ఈ వారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-Xలో భాగంగా 55 మంది బాలలకు, 11 మంది బాలికలకు మొత్తం 66 మందికి, బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించామని ఎస్పీ రూపేష్ తెలిపారు. బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులపై 27 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. బాలలు కార్మికులుగా మారడానికి ముఖ్య కారణం పిల్లలు అనాథలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

తిండి దొరకక పస్తులు ఉంటూ..
సరిపడా ఆదాయం, ఆహారం దొరకక అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిట్టి, చిట్టి చేతులతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారని, బాలలు పనిచేసే చోట సరైన సమయానికి తిండి దొరకక పస్తులు ఉంటూ రోగాలపాలవుతున్నారన్నట్లు గుర్తించారు. బాల్యం ఎంతో అందమైనదని అలాంటి బాల్యం వారికి జీవితాంతం మానని గాయం చేస్తోందన్నారు. బాలకార్మిక రక్కసి కబంధ హస్తాల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్‌, ఆపరేషన్ ముస్కాన్ అనే పేర్లతో బృహత్తర కార్యక్రమాలను 2014 నుంచి ప్రతి ఏటా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్‌ను, జులై నెలలో ముస్కాన్ కార్యక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోందిని ఎస్పీ తెలిపారు. ఏ దేశంలో నైతే బాల కార్మికులు లేని, ఆరోగ్యవంతమైన బాలలుంటారో ఆ దేశం అభివృద్ధిలో ముందుంటుందని ఎస్పీ రూపేష్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Hyderabad: బోడుప్పల్‌లో దొంగనోట్ల ముద్రణ.. ఆ వెబ్‌సిరీస్‌ చూసి ఇన్‌స్పైర్

నేరాలకు పాల్పడుతున్నారు..
ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో రాణించాలంటే విద్యతో పాటు సరైన పౌష్టిక ఆహారం, ఆటలలో రాణించడం, తోటి విద్యార్థులతో పోటీపడేతత్వం ఉండాలని ఎస్పీ రూపేష్ చెప్పారు. కానీ బాల కార్మికులుగా నిలిచిపోవడం వల్ల పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, నైపుణ్యలేమి, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం కారణాలతో నేరస్థులుగా మిగిలిపోతున్నార వాపోయారు. నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలన్నారు. కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రిమినల్ కేసులు తప్పవు..
ఇప్పటి వరకూ చాలామంది పిల్లలను పనిస్థలాల నుంచి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామన్నారు. మిస్సింగ్ కేసులను కూడా ఛేదించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేరుస్తూ బాధిత చిన్నారులకు బాసటగా నిలుస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలను ఎవరైనా వెట్టిచాకిరికి గురి చేసిన, బలవంతంగా బిక్షాటన చేయించిన, పశువుల కాపరులుగా, కిరాణం దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్ లు ఇతర ప్రదేశాలలోనూ పని చేయించడం, చట్టరీత్యా నేరం, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై చట్టరిత్య క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బాలకార్మికులు ఎవరైనా మీ కంట పడితే, పనిచేస్తున్నట్లు సమాచారం అందితే నేరుగా 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు