Jobs : ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెటా? డీఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్...ఇలా అప్లయ్ చేసుకోండి..!!

డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ (DAE)పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఎంపిక రాతపరీక్షల ద్వారా జరగుుతుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష జనవరి 2024 మూడోవారంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

New Update
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

Govt Job Notification : ప్రభుత్వ ఉద్యోగమే(Government Job Notification) టార్గెట్ తో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్ తోపాటు పలు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులు డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబై, దేశవ్యాప్తంగా ఉన్న దాని ఇతర ప్రాంతీయ యూనిట్లలో ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ DAE, dae.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తిగల అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా డిసెంబర్ 31,2023లోపు అప్లయ్ చేసుకోవచ్చు. డీఏఈ పోస్టుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ పోస్టులకు జనవరి 2024 మూడో వారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

పోస్టుల వివరాలు :

జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్-17పోస్టులు

జూనియర్ స్టోర్ కీపర్-45 పోస్టులు

అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టుల్లో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇదే కాకుండా 60శాతం మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్,ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసి ఉండాలి.

వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. అంతేకాదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కూడా ఉంటుంది.

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు విడుదల

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక ప్రకటన చేసింది. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా మార్చి 1 నుంచి 30 వరకూ ఈ రెండు పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

ఈ మేరకు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 .30 వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి చెప్పారు. పదవ తరగతి విద్యార్థులు 6 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు 10 లక్షల మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. అలాగే గతేడాది టెన్త్ ఎగ్జామ్స్ ఆరు పేపర్లతో నిర్వహించగా ఈసారి ఏడు పేపర్ల విధానం అమలు చేయనబోతున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష జరపనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు తేదిల్లో నిర్వహించనుండగా రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు. ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనుండగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు కామన్.

ఇది కూడా చదవండి:  తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా!

Advertisment
Advertisment
తాజా కథనాలు