North Korea: యుద్ధానికి కాలు దువ్వుతున్న కిమ్ జోంగ్ ...మిలిటరీకి పిలుపు..!!

ఉత్తరకొరియా యుద్ధానికి రెడీ అంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ మిలిటరీకి అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆయుధ ఫ్యాక్టరీలో అధునాతన తుపాకులు సహా పలు ఆయుధాలను కిమ్ జోంగ్ పరిశీలించడం దీనికి మరింత బలం చేకూర్చుతోంది.

New Update
North Korea: యుద్ధానికి కాలు దువ్వుతున్న కిమ్ జోంగ్ ...మిలిటరీకి పిలుపు..!!

ఉత్తరకొరియా అంటేనే కాస్త డిఫరెంట్. ఆ దేశ అధ్యక్షుడు ఏం చేసినా యుద్ధ భయాలే ఉంటాయి. క్షిపణులను ప్రయోగించడం, పరీక్షించడం వంటివి తరచుగా చేస్తూనే ఉంటారు. అగ్రదేశంపై మాటల తూటాలు పేల్చుతుంటారు. ఇక ప్రత్యర్థి దేశంపై ఎలా స్పందిస్తారో ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వచ్చిన ఈ వార్త మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. ఉత్తరకొరియా యుద్ధానికి రెడీ అవుతున్నట్లు రాష్ట్ర మీడియా గురువారం తెలిపింది. దీనికోసం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఆ దేశ మిలిటరీకి కూడా పిలుపునిచ్చినట్లు సమాచారం.

యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కిమ్ సైన్యాన్ని అప్రమత్తం చేసినట్లు KCNA పేర్కొంది. యుద్ధ సన్నాహాల్లో భాగంగానే ఓ అత్యున్నతస్థాయి మిలిటరీ జనరల్ ను మార్చినట్లు సమాచారం. ఆయుధాలను పెంచాలని, సైన్యం సన్నాహాలు వేగవంతం చేయాలని కిమ్ ఆదేశించినట్లు సదరు వార్త సంస్థ పేర్కొంది.

ఇక ఉత్తరకొరియా ప్రత్యర్థి దేశం దక్షిణ కొరియా అమెరికా కలిసి నాలుగు రోజుల పాటు సంయుక్తంగా మిలటరీ విన్యాసాలు చేశాయి. ఈ తరుణంలోనే కిమ్ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలిటరీ జనరల్ పాక్ సూ ఇల్ స్థానంలో రియాంగ్ ను నియమిస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. దీంతో మరోసారి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కొరియా ద్వీపకల్పంలోని అస్పష్టమైన మ్యాప్‌లోని మచ్చలను కిమ్ చూపుతున్నట్లు రాష్ట్ర మీడియా ప్రచురించిన సమావేశ ఫోటోలు చూపించాయి. ఈ మచ్చలు దక్షిణ కొరియా రాజధాని సియోల్ చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతంగా కనిపించాయి, ఇక్కడ దేశంలోని 51 మిలియన్ల జనాభాలో సగం మంది నివసిస్తున్నారు. దక్షిణ కొరియా ఆర్మీ ప్రధాన కార్యాలయం ఉన్న సెంట్రల్ సిటీ డేజియోన్ చుట్టూ ఉన్న ప్రాంతం ఇది. 2011 చివరలో తన పాలనను ప్రారంభించినప్పటి నుండి, కిమ్ సీనియర్ ప్రభుత్వ, సైనిక అధికారుల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు