Love Jihadi: ఆ రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌పై కొత్త చట్టం..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్‌ జిహాదీకి సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ప్రకటన చేశారు. అలాగే అస్సాంలో పుట్టినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే పాలసీని కూాడా అమలుచేస్తామని ప్రకటించారు.

New Update
Love Jihadi: ఆ రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌పై కొత్త చట్టం..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లవ్‌ జిహాద్‌'కు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ప్రకటన చేశారు. ఆదివారం అస్సాంలో రాష్ట్రస్థాయి బీజేపీ ఎక్జిక్యూటీవ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే లవ్‌ జిహాద్‌ గురించి మాట్లాడామని.. వీటికి సంబంధించిన కేసుల్లో త్వరలోనే జీవిత ఖైదు శిక్ష విధించే చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. ముస్లిం పురుషులు.. ముస్లిమేతర మహిళలను ఉద్దేశపూర్వకంగా ట్రాప్‌ చేసి పెళ్లి చేసుకొని.. బలవంతగా ఇస్లాం మతంలోకి మార్చడాన్నే లవ్‌ జిహాద్‌ అని అంటారు.

Also Read: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హై అలర్ట్‌ ప్రకటించిన బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌

ఇదిలాఉండగా.. హిమంత బిశ్వ శర్మ మరో కొత్త పాలసీని కూడా ప్రకటించారు. ఈ పాలసీ ప్రకారం అస్సాంలో పుట్టినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అర్హత ప్రమాణాలు ఉంటాయని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విధానాన్ని కూడా తీసుకొస్తామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా.. రాష్ట్రంలో ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

మరోవైపు హిందువులు, ముస్లీంల మధ్య భూముల అమ్మకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. వీటికి సంబంధించిన పనులు ముందుకెళ్లాలంటే ముందుగా ముఖ్యమంత్రి నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా చేశామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 2041 నాటికి అస్సాం ముస్లిం మెజార్టీ రాష్ట్రంగా మారుతుందని ఇటీవల హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రతి పదేళ్లకొకసారి ముస్లిం జనాభా 30 శాతం పెరుగుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర జనాభాలో 40 శాతం ముస్లింలు ఉన్నారని తెలిపారు. మరోవైపు హిందువుల జనాభా ప్రతి పదేళ్లకొకసారి కేవలం 16 శాతం మాత్రమే పెరుగుతోందని.. మస్లింల జనాభా మాత్రం దీనికి రెట్టింపుగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అయితే హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ దనీష్ అలీ తీవ్ర విమర్శలు చేశారు. అసత్యాలను ప్రచారం చేసి.. రాష్ట్రంలో ప్రజల మధ్య విభజనను సృష్టిస్తున్నారని ఆరోపించారు. జనాభా లెక్కల ప్రకారం.. 1951లో ముస్లి జనాభా 25 శాతం ఉందని.. 2011 నాటికి 34.22 శాతానికి చేరుకుందని స్పష్టం చేశారు.

Also Read: కోటి మంది బీహార్‌ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభిస్తారు: ప్రశాంత్ కిషోర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay Devarakonda: "లవ్‌ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ సర్ప్రైజ్‌ గిఫ్ట్‌..

విజయ్‌ దేవరకొండ హైదరాబాద్ లో తన కొత్త రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్‌ కు గిఫ్ట్‌ పంపగా, బన్నీ‘‘స్వీట్‌ బ్రదర్‌’’ అంటూ స్పందించాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి హైలైట్ అయింది.

New Update
Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda: టాలీవుడ్‌ యూత్ ఐకాన్ అల్లు అర్జున్‌(Allu Arjun), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

మై స్వీట్‌ బ్రదర్‌..

హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్‌ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్‌ బ్రదర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్‌!" అంటూ అల్లు అర్జున్‌ హృదయపూర్వకంగా స్పందించాడు.

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్‌ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్‌ ఆనందంతో, ‘‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్‌ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment