Ap: మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ చూపిస్తే...కొత్త జంటకు రేషన్‌ కార్డు!

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్టుల జారీ ప్రక్రియ త్వరలోప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్నారు.జగన్‌ బొమ్మ, వైసీపీ రంగులతో ఉన్న కార్డులను కూడా మార్చాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

New Update
Ap: మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ చూపిస్తే...కొత్త జంటకు రేషన్‌ కార్డు!

AP New Ration Cards: రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్టుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం (Marriage Certificate) ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుల్నీ వదలకుండా..జగన్ బొమ్మను ముద్రించింది. వైసీపీ రంగులతోనే కార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు ప్రభుత్వాధికారులు పరిశీలిస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో 89 లక్షల రేషన్‌ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు తెలిపారు.

వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్‌ చేస్తుంటే..నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది.

Also Read: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment