World Wildlife Day: గుజరాత్‌లో అడవిబాట పట్టిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌ జునాగఢ్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం బాటపట్టారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా కొందరు మంత్రులు, అటవీ శాఖ అధికారులతో కలిసి మోదీ జీప్ సఫారీ చేశారు. వైల్డ్‌లైఫ్‌ ఆవశ్యకత గురించి ఆయన Xలో పోస్ట్ చేశారు.

New Update
World Wildlife Day PM Modi

World Wildlife Day PM Modi Photograph: (World Wildlife Day PM Modi)

ప్రధాని మోదీ అభయారణ్యంలో తిరుగుతున్నాడు. సింహాలు, జింకలను ఫొటోలు తీస్తూ పచ్చని అడవి అందాలను ఆస్వాదిస్తున్నాడు. గుజరాత్‌ జునాగఢ్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లయన్ సఫారీకి వెళ్లారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆయన గిర్ నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి జీప్ సఫారీ చేశారు.  సింహాలు, జింకలు, వన్యప్రాణులను ఫొటోలు తీస్తూ అడవి అంతా కలియ తిరిగారు. 

భూమిపై నున్న అద్భుతమైన జీవవైవిధ్యాన్ని రక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ మనుగడలో ప్రతి జాతి కీలక పాత్ర పోషిస్తుంది.-- రాబోయే తరాలకు వాటి భవిష్యత్తును కాపాడుకుందాం. వన్యప్రాణులను సంరక్షించడం, రక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి మనం గర్విస్తున్నామని రాసి మోదీ జంగిల్ సఫారీ వీడియోను ట్యాగ్ చేశారు.

Also read: SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

అనంతరం గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం ససన్ గిర్‌లో జాతీయ వన్యప్రాణుల బోర్డు 7వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించున్నారు. సమావేశం తర్వాత ఆయన ససన్‌లోని కొంతమంది మహిళా అటవీ సిబ్బందితో మాట్లాడనున్నారు. ఆసియా సింహాల జాతిని రక్షిచడానికి గిర్ నేషనల్ పార్క్‌లో  కేంద్రం ప్రాజెక్ట్ లయన్ అమలు చేసింది. పెరుగుతున్న సింహాల సంఖ్య ఆధారంగా వాటికి ఆవాసాలను భద్రపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ నేషనల్ పార్క్‌లో 2010నాటికి 411 సింహాలు ఉండగా.. 2015లో 523 సింహాలు, 2020 జూన్ నాటికి 674 వరకు సింహాల సంఖ్య పెరిగిందని అంచనా వేశారు.

Also Read ; Adulterated milk: డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న తన ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ వరకు సమయం ఇవ్వాలని ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని కోరాడు. మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చామని.. మధ్యలోనే వెళ్లిపోమంటున్నారని ఆవేదన చెందాడు. చికిత్సకు ఇప్పటికే రూ.కోటి ఖర్చు అయ్యిందన్నారు.

New Update
Surgeries

Surgeries

తన ఇద్దరు పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. పుట్టుక నుంచి తన ఇద్దరు పిల్లలు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చారు. ఇప్పుడు పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ కాకుండానే మధ్యలో వెళ్లాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

కొంత సమయం ఇవ్వాలని..

చికిత్స పూర్తి చేయడానికి అనుమతించాలని ప్రభుత్వాలను కోరాడు. ఢిల్లీలో అధునాతన చికిత్స ఉందని, అందుకే చికిత్సకు ఇండియాకు వచ్చినట్లు తెలిపాడు. ఇంకో వారం రోజుల్లో శస్త్రచికిత్స జరగనుంది. అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే పిల్లల వైద్యానికి రూ.కోటి ఖర్చు అయ్యిందని, ఇప్పుడు మధ్యలోనే చికిత్స ఆపేస్తే.. పిల్లల ప్రాణాలకే ప్రమాదమని తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఇంకో రెండు వారాల సమయం ఇస్తే చికిత్స అన్ని పూర్తి చేసుకుని వెళ్లిపోతామని తండ్రి ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment