Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు

New Update
wine-shops

wine-shops

ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు మద్యం ప్రియులు కూడా బాగానే ఆసక్తి చూపించారు.  ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అంటూ ఆఫర్లు పెట్టడంతో  వైన్స్ షాపుల వద్ద భారీ స్థాయిలో గుమిగూడారు. లక్నోతో సహా అనేక నగరాల్లో మద్యం దుకాణాల వెలుపల ఆఫర్ల భారీ పోస్టర్లు వెలిశాయి.

మందుబాబులను కంట్రోల్ చేయడానికి

పొడవైన క్యూలు, రద్దీ, తోసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.  మందుబాబులను కంట్రోల్ చేయడానికి పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గడువు ముగిశాక ప్రభుత్వం ఆ మద్యాన్ని సీజ్ చేసే అవకాశం ఉండటంతో వ్యాపారులు ఇలా చేసినట్లు సమాచారం. కాగా 2025-26 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది.  ఏప్రిల్ 1 నుండి ఇ-లాటరీ వ్యవస్థ ద్వారా కొత్త దుకాణాలు తెరవబడతాయి.  కాబట్టి మద్యం దుకాణాలు 2025 మార్చి 31 నాటికి తమ స్టాక్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది.  

Also read :  PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతురను హతమార్చిన తండ్రి

బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఆగ్రహించిన తండ్రి ఆమెను ఇంటికి రప్పించి హత్య చేశాడు. చివరికి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

New Update
Bihar Man Kills Daughter

Bihar Man Kills Daughter

బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తండ్రి ఆమెను హత్య చేయడం కలకలం రేపింది. మృతదేహన్ని బాత్‌రూమ్‌లో ఉంచి  లాక్‌ చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాక్షి (25) అనే అమ్మాయి తన ప్రియుడితో కలిసి మార్చి 4న ఢిల్లీకి పారిపోయింది. మాజీ సైనికుడైన తండ్రి ముఖేష్ సింగ్ వారం తర్వాత తన కూతురుకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత సమస్తిపూర్‌కు ఆమెను రప్పించాడు.   

Also Read: భారత్‌కు చేరుకున్న తహవ్వుర్ రాణా.. ఉరిశిక్ష విధిస్తారా ?

కానీ వేరే కులానికి చెందిన వ్యక్తితో కూతురు వెళ్లిపోవడంతో తండ్రి ముఖేష్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి ఏప్రిల్ 7న తన కూతురును హత్య చేశాడు. ఇంట్లో బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని ఉంచి లాక్ చేశాడు. అనంతరం ఆమె ప్రియుడిని కూడా హత్య చేసేందుకు వెళ్లాడు. కానీ అతడు గ్రామంలో లేకపోవడంతో వెనక్కి వచ్చేశాడు. అయితే కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లి భర్తను ముఖేష్‌ను అడిగింది. దీనికి అతడు సాక్షి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. 

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

దీంతో కూతురు కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటికి వచ్చి పరిశీలించారు. లాక్‌చేసిన బాత్‌రూమ్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. డోర్‌ తీయగా లోపల మృతదేహం కనిపించడంతో షాక్ అయిపోయారు. దీంతో తండ్రి ముఖేష్‌ను అదుపులోకి తీసుకొని అడిగారు. వేరే కులం వ్యక్తితో పారిపోవడంతో తానే హత్య చేసినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. చివరికీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

rtv-news | murder

 

Advertisment
Advertisment
Advertisment