పొట్టు పొట్టు కొట్టుకున్న లాయర్లు, జడ్జి.. పోలీసుల ఎంట్రీతో (వీడియో)

యూపీ ఘజియాబాద్‌ జిల్లా కోర్టులో రచ్చ జరిగింది. ఓ బెయిల్ పిటిషన్ విషయంలో జడ్జి, లాయర్‌ మధ్య గొడవతో వివాదం మొదలైంది. గొడవ పెద్దది కావడంతో పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. లాయర్లపై లాఠీఛార్జ్ చేశారు. ఈ గొడవలో పలువురు లాయర్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. 

New Update

యూపీ ఘజియాబాద్‌ జిల్లా కోర్టులో విచిత్రం జరిగింది. లా అండ్ ఆర్డర్‌ని కాపాడాల్సిన న్యాయస్థానాలు అల్లర్లకు దిగాయి. గొడవలు, తగాదాలను ఆపాల్సిన వారే కోర్టులో రచ్చ రచ్చ చేశారు. అవును మీరు విన్నది నిజమే. కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.

ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'

ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంత వరకు వెళ్ళారు. మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఎంత చెప్పినా వినకపోవడంతో లాయర్లపై లాఠీఛార్జ్ చేశారు. ఇందులో దాదాపు 10 మందికి పైగా లాయర్లు తీవ్రంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!

జిల్లా సెషన్స్ కోర్టులో ఉద్రిక్తత

యూపీ ఘజియాబాద్‌ జిల్లా సెషన్స్ కోర్టులో జడ్జి అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ప్రాసిక్యూషన్ ప్రత్యేక విచారణ కోసం కేసును వాయిదా వేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలని జడ్జ్ వారికి సూచించారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

దీంతో న్యాయవాదులు అసంతృప్తి చెంది కోర్టు ఆవరణలో కేకలు వేశారు. ఆపై పరిస్థితి అదుపు తప్పింది. జడ్జ్, న్యాయవాదుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ కారణంగా కోర్టు పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. జడ్జ్, లాయర్లకు మధ్య మాటా మాటా పెరిగింది.

ఇది కూడా చదవండి:  బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!

న్యాయవాదులపై లాఠీఛార్జ్

అక్కడితో ఆగకుండా చేయిచేసుకునేంత వరకు వెళ్లింది. ఇక లాభంలేదని జస్టిస్ కుమార్ పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులను పిలిచారు. దీంతో రంగలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదర గొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. న్యాయవాదులపై లాఠీఛార్జ్ చేశారు. ఆపై పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పారామిలీటరీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఘటనలో దాదాపు 8 నుంచి 10 మంది న్యాయవాదులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.

New Update
Exercise Aakraman

పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్‌లో రాఫెల్ యుద్ధ వివానాలు పాల్గొన్నాయి. పంజాబ్‌లోని అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లను మోహరించింది. ఇందులో లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడుల వంటి వాటిని నిర్వహించాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లు తెలుస్తోంది. 

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

రఫెల్ ఫైజర్ జెట్లు సరిహద్దు ప్రాంతాలకు చాలా దగ్గరగా ప్రయాణించాయని తెలుస్తోంది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ (AWACS) అమర్చిన విమానాలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచాయి. అదే సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లు కూడా సరిహద్దు దాటి ఎగురుతూ కనిపించాయి. ఇండియన్ నేవీ కూడా గురువారం ఐఎన్ఎస్ సూరత్‌కు చెందిన ఓ క్షిపణి పరీక్షను విజయవంతం చేసింది. పాక్ సరిహద్దులో కరాచీ దగ్గర పాకిస్తాన్ కూడా ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయాణించే ఓ మిస్సేల్ టెస్ట్ నిర్వహించింది. ఇలా ఇరు దేశాలు సైనిక బలాబలాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితులు యుద్ధం రాబోందుంతా అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి. 

( loc | indian-air-force | Exercise Aakraman | attack in Pahalgam | Pahalgam attack | pakistan | india | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment