Viral : ఓర్ని ఇదేం విచిత్రం.. చితి నుంచి లేచి నీళ్లు అడిగిన వృద్ధురాలు

తమిళనాడులోని తిరుచ్చిలో విచిత్రం జరిగింది. చనిపోయిందని చితిపై పెట్టిన ఓ వృద్ధురాలు పైకిలేచి ఆశ్చర్యపరిచింది. 62ఏళ్ల చిన్నమ్మాల్ అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అదే సమయంలో అవ్వ పైకిలేచి నీళ్లు అడగడంతో షాక్ అయ్యారు.

New Update
died women

ఇదో విచిత్రమైన సంఘటన. చనిపోయిందనుకున్న ఓ వృద్ధురాలని చితిపై పెట్టారు. అంత్యక్రియలు చేస్తున్న సమయంలో ఆమె లేచి నీళ్లు అడిగి అక్కడున్న వారందరినీ షాక్‌కు గురి చేసింది. అవును మీరు విన్నది నిజమే. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని కురుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన 72ఏళ్ల పంపైయ్యన్, అతని భార్య 62 ఏళ్ల చిన్నమ్మాల్ పూలతోట నడుపుతున్నారు. ఈ నెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను సమీప ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో చేసేదేమి లేక చిన్నమ్మాల్‌ను తిరిగి ఇంటికి పంపించేశారు. తిరుగు ప్రయాణంలో చిన్నమ్మాల్ మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని వారి వారి బంధువులకు తెలుపగా.. వారు బోరున విలపిస్తూ శ్మశానవాటికకు చేరుకున్నారు. 

Also Read:  Dog యజమానులకు షాక్.. భారీ జరిమాన కట్టాల్సిందే..!

దహనానికి అన్ని ఏర్పాటు

అందరూ అక్కడకు చేరుకుని చిన్నమ్మాల్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆమె శరీరాన్ని దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు చిన్నమ్మాల్‌ను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. అదే సమయంలో కొందరు దగ్గర బంధువులు ఆమెపై పడి బోరున విలపించారు.

Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్

చితి నుంచి పైకి లేచి నీళ్లు అడిగిన అవ్వ

అప్పుడే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వెంటనే చిన్నమ్మాల్ తన మీద పడి ఏడుస్తున్న బంధువులలో ఒకరి చేయి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడున్నవారంతా ఖంగుతిన్నారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

పహల్గాం దాడి చేసింది తామేనని TRF ప్రకటించింది. కానీ దీనివెనక లష్కర్ ఈ తోయిబా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు సమాచారం. 2023లో TRFను భారత్ 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ నిషేధం విధించింది.  

New Update

Pahalgam Attack: పహల్గాం బైసరన్‌లో దాడికి పాల్పడింది 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)'గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబాతో కలిసి పనిచేస్తున్న టీఆర్ఎఫ్ 2019నుంచి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. కశ్మీర్ యువతను ఆకర్షించి, వారికి ఇండియాపై వ్యతిరేక పెంచి ఉగ్రవాద సంస్థలో చేర్చుకుంటున్నట్లు పేర్కొంది. జనవరి 2023లో  చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద TRF ను 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ భారత హోం శాఖ అధికారిక ప్రకటన విడుదలచేసింది.  

జర్నలిస్టులకు టిఆర్‌ఎఫ్ బెదిరింపులు..

ఈ మేరకు అప్పటినుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించింది. ఉగ్రవాదుల నియామకం, ఉగ్రవాదుల చొరబాటు, పాకిస్తాన్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకోసం ఈ సంస్థ పనిచేస్తోందని తెలిపింది. కశ్మీర్‌లోని జర్నలిస్టులను టిఆర్‌ఎఫ్ బెదిరింపులకు గురిచేసిన వెంటనే కేంద్ర హోంశాఖ ఈ సంస్థను నిషేధించింది.  అయితే పహల్గాం దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్​ చెప్పినప్పటికీ దీని వెనుక లష్కర్ ఈ తోయిబా ఉన్నట్లు పోలీసులు అధికారులు బలంగా వాదిస్తున్నారు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

లష్కార్ ఈ తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఈ దాడికి వ్యూహ రచన చేసినట్టు సమాచారం. పాకిస్తాన్ కు చెందిన సైఫుల్లా కసూరి.. లష్కర్ ఈ తోయిబా సంస్థలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు అనుమానిస్తున్నారు. సైఫుల్లా కసూరి ఎల్ఇటీ గ్రూప్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సారధ్యంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థకు గ్రౌండ్‌ వర్కర్స్‌ సహాయ సహకారాలు అందిస్తున్నారని, స్థానిక ప్రజల సహకారంతోనూ దాడులు చేయగలుగుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

pehalgam terror attack | terrorist | today telugu news 

Advertisment
Advertisment
Advertisment