Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం!

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం బెంగళూరు నుంచి అస్పాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లుగా సమాచారం.

New Update
odisha-train accident

odisha-train accident

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం బెంగళూరు నుంచి అస్పాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ మిశ్రా తెలిపారు. విషయం తెలియగానే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. NDRF, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి పంపించడానికి వేరే  రైలును  ఏర్పాటు చేశారు.  ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment