బెంగుళూర్‌ వాసులకు అలర్ట్.. 45 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

బెంగుళూర్‌లో మెట్రో నిర్మాణ పనుల కారణంగా 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ దేవరాజ్ ప్రటించారు. ORR 27వ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి ఇబ్బలూరు స్కూల్ వరకు సర్వీస్, మెయిన్ రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

New Update
Traffic restrictions 1

Traffic restrictions 1 Photograph: (Traffic restrictions 1)

మెట్రో లైన్ విస్తరణ పనుల్లో భాగంగా బెంగుళూర్‌లో  పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పిల్లర్ నంబర్ 163 నుంచి 167 వరకున్న 4 పిల్లర్ల నిర్మాణ పనులు ప్రారంభమైయ్యాయి. ఆ రూట్‌లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో ట్రాపిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఫిబ్రవరి 19న ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఈ పనులు దాదాపు 45 రోజుల పాటు జరగనున్నాయి. దీంతో పోలీసులు అటు వైపు బారికెట్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా మార్గాల్లో నెమ్మదిగా వాహనాల రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు.

Also Read:  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!

ఔటర్ రింగ్ రోడ్ 27వ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి ఇబ్బలూరు గవర్నమెంట్ స్కూల్ వరకు ర్యాంప్ దిగువన ఉన్న సర్వీస్ రోడ్డు, మెయిన్ రోడ్డు రెండింటిలోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ రూట్‌లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహరించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ దేవరాజ్ ప్రజలను కోరారు.

Also Read:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

 

Advertisment
Advertisment
Advertisment