Girls Hostel : బాత్రూంల్లో స్పై కెమెరాలు.. గుడ్లవల్లేరు ఘటన రిపీట్‌!

కొన్ని రోజుల క్రితం ఏపీలోని గుడ్లవల్లేరులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న వార్త ఏ విధంగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో జరగడం తీవ్ర సంచలంగా మారింది.

author-image
By Bhavana
New Update
bengalore

Bengalore: కాలేజీలు, లేడీస్ హాస్టల్స్‌ బాత్రూంలలో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి.. యువతుల ప్రైవేటు వీడియోలు రికార్డు చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్నాయి.కొన్ని రోజుల క్రితం ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్‌ వాష్‌రూంలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి.. విద్యార్థినుల నగ్న వీడియోలు రికార్డ్ చేశారని వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

 తాజాగా  అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కాలేజీలోని గర్ల్స్‌ హాస్టల్‌ వాష్‌రూంలో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి.. వీడియోలు రికార్డ్ చేసిన ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి ఫోన్లో నగ్న వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో పెను సంచలనం రేపుతుంది.

బెంగళూరు సమీపంలోని కుంబల్‌గోడు ఏసీఎస్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో తాజాగా ఓ విద్యార్థి.. యువతుల రహస్య వీడియోలు తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ విద్యార్థి.. తమ ప్రైవేటు వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడని కొందరు విద్యార్థినులు కాలేజీలో నిరసన వ్యక్తం చేశారు. ఇక ఆ విద్యార్థులకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపి.. వారితో కలిసి కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. 

ఈ నేపథ్యంలోనే కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు.. ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ని నిందితుడిగా పేర్కొంటూ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతడి మొబైల్ ఫోన్ సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇక ఆ నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో దాదాపు 7, 8 వీడియోలను రికార్డ్ చేశాడని.. అయితే వాటిని తోటి విద్యార్థులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇ

క ఈ వీడియోల విషయం బయటికి చెప్తే వారిని చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  గవర్నర్‌ కు 13 ఏళ్ల జైలు శిక్ష!

Advertisment
Advertisment
తాజా కథనాలు