Planet Parade: ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్‌ లోకి 7 గ్రహాలు!

వచ్చే నెలలో ఆకాశంలో అద్భుతం జరగబోతుంది.టెలిస్కోప్‌ లేకుండా ఏడు గ్రహాలను ఒకేసారి చూసే అవకాశం రాబోతుంది.'ప్లానెట్ పరేడ్​'గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం అవ్వబోతుంది.

New Update
solar

solar

planet Parade: వచ్చే నెలలో ఆకాశంలో అద్భుతం జరగబోతుంది.టెలిస్కోప్‌ లేకుండా ఏడు గ్రహాలను ఒకేసారి చూసే అవకాశం రాబోతుంది.వాటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖ పై ఉన్నట్లు కనపడతాయి.  'ప్లానెట్ పరేడ్​'గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం అవ్వబోతుంది. అయితే అంతకంటే ముందే జనవరిలోనే భారత దేశంలో ఈ ప్లానెట్ పరేడ్​ను చూసే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: Global Risks Report: 2025లో ప్రపంచానికి పొంచిఉన్న ముప్పులివే..

కానీ అప్పుడు ఆరు గ్రహాలు మాత్రమే కనిపించనున్నాయి.ఈ ప్లానెట్ పరేడ్​లో అంగారకుడు, బృహస్పతి, శని, శుక్రడు, నెప్ట్యూన్, యురేనస్- ఈ ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడా, భారత దేశ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూస్తారని తెలుస్తుంది. ఇది జనవరి 21 నుంచి 31 వరకు ఉంటుంది. కానీ జనవరి 25 మాత్రం మరింత దగ్గరగా కనిపించే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాత్రి సమయంలో వీటిని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Also Read: TG: రైతు భరోసాపై పకడ్బంది ప్లాన్.. సాగుచేయని భూమిని ఎలా గుర్తిస్తారంటే

ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి..

అయితే శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను ఎటువంటి ప్రత్యేక పరికరాలను లేకుండానే చూడొచ్చు. కానీ నెప్ట్యూన్, యురేనస్​ను టెలిస్కోప్ ద్వారా మాత్రమే స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. ముందుగా జనవరి 19న శుక్రుడు, శని గ్రహాలు ఒక వరుసలోకి రానున్నాయి. ఆ తర్వాత జనవరి 21న సాయంత్రం శుక్రుడు బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ ఒకే వరుసలోకి రానున్నాయి. ఫిబ్రవరి 28న బుధుడు శుక్రడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి.

ఇలా ఏడు గ్రహాలు కనిపించే ప్లానెట్ పరేడ్ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దృశ్యం చివరిసారిగా 2022లో ఆవిష్కృతం అయింది. ఈ ప్లానెట్​ పరేడ్  రాత్రి సమయంలో కొద్ది సేపు మాత్రమే కనపడుతుంది. కొండలు లేదా బహిరంగ ప్రదేశాలు, తక్కువ కాంతి ఉండే ప్రాంతాల నుంచి చూడవచ్చు. టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Also Read:Mutton free: ఇంటింటికీ ఫ్రీగా మటన్.. కనుమ సందర్భంగా బంపర్ ఆఫర్!

Also Read: Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్‌.. విమాన టికెట్‌ ధరలు చుక్కల్లోనే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బీహార్‌ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రవాదులను వదలిపెట్టమని స్పష్టం చేశారు.

author-image
By B Aravind
New Update
PM Modi Pay Tributes to Pahalgam Terrorist Attack Victims

PM Modi Pay Tributes to Pahalgam Terrorist Attack Victims

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని అన్నారు. గురువారం ఆయన బీహార్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ నిర్వహిస్తున్న జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో.. రూ.13,480 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని.. ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. అలాగే తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మాట్లాడుతూ.. '' పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తాం. కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం. పహల్గాం ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు. భారత ఆత్మపై జరిగింది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.  చనిపోయిన వాళ్లలో అన్న రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నారు. ఉగ్రవాదులకు సహకరించిన సూత్రధారులను కూడా వదలిపెట్టమని'' ప్రధాని మోదీ అన్నారు. 

Also Read: స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!

ఇక టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్‌‌‌‌లో తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు పెద్ద సంఖ్యలో రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. టెర్రరిజాన్ని సహించం.. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు. కాశ్మీరుల  రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. స్వచ్చంధంగా దుకాణాలు మూసేసి.. నిరసనల్లో పాల్గొంటున్నారు. ఐక్యతా నినాదాలతో భారత సైన్యానికి మద్దతు ఇస్తున్నారు.హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్

మరోవైపు పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్‌లోని  పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను వారం రోజుల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  

ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్లూజివ్‌ జోన్‌లో ఈ క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్‌ ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఈ పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని.. భారత రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. దీంతో ముంబయిలోని భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరమంతా పోలీసు బలగాలు రాత్రిపూట క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని సీనియర్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో బీచ్, హోటల్స్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే పాకిస్థాన్‌ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి ఇది భారత్, పాక్ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. 

telugu-news | rtv-news | pm modi 

Advertisment
Advertisment
Advertisment