Tamil Nadu Assembly elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం...ఒక్క ఓటు తేడాతో ఓడిన మంత్రి? ఎవరో తెలుసా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక అనూహ్యమైన,అత్యంత ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యంలో "ప్రతి ఓటూ విలువైనదే" అనే మాటకు నిదర్శనంగా, కేవలం ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలుకావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

New Update
FotoJet - 2026-05-05T083856.402

Minister who lost by one vote

Tamil Nadu Assembly elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక అనూహ్యమైన,అత్యంత ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యంలో "ప్రతి ఓటూ విలువైనదే" అనే మాటకు నిదర్శనంగా, కేవలం ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలుకావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అరుదైన ఓటమికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

తమిళనాడు డీఎంకే ప్రభుత్వంలో కీలకమైన సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న కేఆర్ పెరియకరుప్పన్, తిరుప్పత్తూరు నియోజకవర్గం నుంచి ఘోర పరాజయాన్ని చవిచూశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి ఇక్కడ విజేతగా నిలిచారు. హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో శ్రీనివాస్ సేతుపతికి 83,375 ఓట్లు రాగా, మంత్రి పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు లభించాయి. అంటే కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో మంత్రి తన పదవిని, సీటును కోల్పోయారు.

లెక్కింపు ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రౌండ్ ముగిసే సమయానికి పెరియకరుప్పన్ 30 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. కానీ, పోస్టల్ బ్యాలెట్లు,తుది గణాంకాలు క్రోడీకరించేసరికి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆఖరి ఓటు టీవీకే అభ్యర్థికి అనుకూలంగా పడటంతో పెరియకరుప్పన్ దురదృష్టవశాత్తు ఓడిపోయారు.

ఈ నియోజకవర్గ పరిధిలోని ఆర్. పలకురిచి పంచాయితీకి చెందిన సుమారు 2,000 మంది ఓటర్లు పరిపాలనాపరమైన సరిహద్దు వివాదాల కారణంగా ఎన్నికలను బహిష్కరించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని నిరసిస్తూ వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకవేళ ఆ గ్రామస్థులు ఓటింగ్ లో పాల్గొని ఉంటే ఫలితం మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బహిష్కరణే మంత్రి కొంపముంచిందని చెప్పవచ్చు.

పెరియకరుప్పన్ డీఎంకేలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. 2006 నుండి వరుసగా నాలుగు సార్లు తిరుప్పత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయనకుంది. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ, దేవదాయ శాఖ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. శివగంగ జిల్లా డీఎంకే కార్యదర్శిగా పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఇలా ఒక్క ఓటుతో ఓడిపోవడం డీఎంకే శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరోవైపు, టీవీకే మద్దతుదారులు ఈ విజయాన్ని ఒక చారిత్రక మార్పుగా అభివర్ణిస్తున్నారు. ఒక ఓటు ఎంతటి బలమైన నాయకుడినైనా ఇంటికి పంపగలదని ఈ ఫలితం మరోసారి నిరూపించింది.

Advertisment
తాజా కథనాలు