/rtv/media/media_files/2024/12/06/Wzl0c0uqwQNKiIrthGhU.jpg)
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్ న్యూస్ తెలిపారు. అయ్యప్ప మాళ వేసిన భక్తులు తప్పకుండా శబరిమళను దర్శించుకుంటారు. ఈ క్రమంలో దర్శనానికి వెళేటప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ మండలం మకరవిళక్కు యాత్రకు వెళ్లే భక్తులకు సులభంగా దర్శనం అయ్యేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు
To ease Sabarimala pilgrimage for devotees, police create portal#Sabarimala https://t.co/FrbspIw5N2
— Madhyamam Online (@MadhyamamOnline) December 5, 2024
భక్తులకు సులభంగా దర్శనమయ్యేలా..
శబరిమల పోలీస్ గైడ్ అనే ఒక పోర్టల్ను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్ సాయంతో భక్తులు సులభంగా దర్శనం చేసుకోవచ్చు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్లో పోలీసుల హెల్ప్లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, పోలీస్ స్టేషన్ల నంబర్లు, అంబులెన్సు, అగ్నిమాపక దళం, ఫుడ్ సెఫ్టీ, కేఎస్ఆర్టీసీ, శబరిమళ వివరాలు, చరిత్ర, వాహనాలు పార్కింగ్, రోడ్డు, రైలు, వాయు మార్గాల వివరాలు అన్ని కూడా పొందుపరిచారు. భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పోర్టల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఇది కూడా చూడండి: యూన్పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు
ఇదిలా ఉండగా భక్తులకు ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటీవల కొత్త రైళ్లను కూడా దక్షిణ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరికొన్ని రోజుల్లో 28 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్లైన్స్ ఇదే!
ఈ 28 రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి నడవనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని మౌలాలి, కాచిగూడ నుంచి నడుస్తాయని సమచారం.
ఇది కూడా చూడండి: పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు