రతన్‌ టాటాతో గడిపిన క్షణాలు గుర్తుచేసుకున్న పీవీ సింధూ, బిల్‌గేట్స్

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రముఖులతో పాటు నెటిజన్లు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా క్రీడాకారిణి పీవీ సింధూ, వ్యాపారవేత్త బిల్‌గేట్స్ ఆయనతో కలిసిన క్షణాలను పంచుకున్నారు.

New Update
PV Sindhu

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రముఖులతో పాటు నెటిజన్లు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ ఛాంపియన్ పీవీ సింధూ, అలాగే మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గెట్స్ ఎక్స్‌లో రతన్‌ టాటాకు సంతాపం తెలిపారు. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. 

Also Read: రతన్ టాటా వారసుడు ఎవరు?.. రేసులో నలుగురు !

''రతన్ సర్, మీ వినయం, కరుణ, దయ నిజంగా సాటిలేనివి. కొన్నిసార్లు మిమ్మల్ని కలిశాను. ఆ క్షణాలు నాకు ఎప్పటికీ ప్రియమైనవే. జ్ఞానంతో నిండిన ప్రతీఒక్కటి కూడా జీవితాంతం నాతో ఉండిపోతుంది. మన సుదీర్ఘ సంభాషణలు, వ్యాపారం నుంచి జంతు సంరక్షణ వరకు, జీవితం గురించి నాకు చాలా నేర్పిన అమూల్యమైన పాఠాలు నిండి ఉన్నాయి. మీరిచ్చిన ప్రేరణ, చేసిన కృషికి ధన్యవాదాలు. మీమ్మల్ని మిస్ అవుతున్నామని'' పీవీ సింధూ పోస్ట్ చేశారు. 

అలాగే బిల్‌గేట్ల్ కూడా లింక్‌డిన్‌లో రతన్ టాటా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''రతన్ టాటా దార్శనికత కలిగిన నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారత్, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. కొన్ని సందర్భాల్లో ఆయనను కలుసుకున్నాను. మానవాళికి సేవ చేయాలనే ఆయన బలమైన ఉద్దేశ్యం నన్ను కదిలించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితాలను అందించేందుకు సాయం చేయడంలో మేము అనేక కార్యక్రమాలలో భాగస్వాములమయ్యాము. ఆయన మన నుంచి దూరమైన ప్రభావం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.  కానీ ఆయన వదిలిపెట్టిన వారసత్వం, అతను సెట్ చేసిన ఉదాహరణ తరతరాలకు స్ఫూర్తినిస్తుందని'' బిల్‌గేట్స్ అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment