Reserve Bank of India : ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఎండీ పాత్రా ఈ ఏడాది జనవరిలో  వైదొలగడంతో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది.

New Update
 RBI Deputy Governor

RBI Deputy Governor Photograph: (RBI Deputy Governor )

 Reserve Bank of India : భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఎండీ పాత్రా ఈ ఏడాది జనవరిలో  వైదొలగడంతో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. మూడేళ్ల కాలానికి ఆమె నియమకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించగా, ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పూనమ్ గుప్తా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్‌) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అలాగే, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు, 16వ ఆర్థిక సంఘానికి సాహా మండలి కన్వీనర్‌గా కూడా ఉన్నారు.  

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

021లో ఎన్‌సీఏఈఆర్‌లో చేరడానికి ముందు, ఆమె వాషింగ్టన్, డీసీలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్‌లో దాదాపు రెండు దశాబ్దాలు సీనియర్ స్థాయిలో పనిచేశారు. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ (యూఎస్)లో కూడా ప్రొఫెసర్‌గా, ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. పూనమ్ గుప్తా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ)లో ఆర్‌బీఐ చైర్ ప్రొఫెసర్‌గా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్)లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, యూఎస్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ తీసుకున్నారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు గానూ ఆమెకు ఎగ్జిమ్ బ్యాంక్ బహుమతి లభించింది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.

New Update
kerala emp

kerala emp

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా...అతడిని మరో వ్యక్తి మోకాళ్ల పై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ...నిర్దేశించిన టార్గెట్‌ ను పూర్తి చేయని ఉద్యోగుల పై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

పోలీసుల సమాచారం ప్రకారం..కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు.ఘటన మాత్రం పెరుంబవూర్‌ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే యజమాని మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది.దీని పై ఉద్యోగులు ఇప్పటి వరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

ఈ అమానవీయ ఘటన పై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలు షాక్‌ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్‌ కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటన పైపూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

Also Read: TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ

Also Read: Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు

 kerala | employees | tortured | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment