Manipur: గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి.. సీఎం వేడుకోలు!

మణిపూర్‌లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజలు అంతా గతాన్ని మర్చిపోయి తనను క్షమించాలని కోరారు.

New Update
biren

biren

Manipur: 2023 మే నెల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న జాతి హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా స్పందించారు. గతంలో జరిగిన అన్నింటినీ మర్చిపోయి, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నవేళ ప్రజలు తనను క్షమించాలని కోరారు. ఇంఫాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హింసాకాండ గురించి ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది చాలా దురదృష్టకరంగా గడిచిందని ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ అన్నారు.

Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

గతేడాది మే 3వ తేదీ నుంచి నేటి వరకు జరుగుతున్న హింసాకాండకు ప్రజలకు క్షమాపణ తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు.ఈ హింసాకాండ వల్ల అనేక మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని, మరికొందరు తమ ఇళ్లు వదిలిపెట్టి  వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఈ అల్లర్లలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

Also Read: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

ఈ సంఘటనలకు బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి  బిరేన్ సింగ్ వివరించారు. అయితే గత మూడు, నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఓ కొలిక్కి వస్తున్నాయని అన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని తాను ఆశిస్తున్నట్లు వివరించారు.

Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్‌,ఐపీఎస్‌ లకు పదోన్నతులు!

2023 మే 3వ తేదీ నుంచి కుకీ, మైతేయిల మధ్య ఘర్షణలు చెలరేగగా.. ఈ హింసాకాండలో మొత్తం 200 మందికి పైగా చనిపోయారని  ముఖ్యమంత్రి అన్నారు. అలాగే నిరాశ్రయులైన 2 వేల 58 మంది కుటుంబాలను ఇంఫాల్‌లోని పలు ప్రాంతాల్లో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంట హింసను ఆరికట్టేందుకు NH-2, NH-37 లపై వరుసగా అదనపు భద్రతా సిబ్బందిని ఉంచినట్లు చెప్పారు. 

Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

నిరసనకారులు ప్రభుత్వం నుంచి దోచుకున్న 6 వేల ఆయుధాల నుంచి 3 వేల ఆయుధాలను ఇప్పటికే  స్వాధీనం చేసుకున్నట్లు సీఎం చెప్పారు. అలాగే 625 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు  మొత్తం 12 వేల 247 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అంతేకాకుండా మణిపూర్ ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ను 32 నుంచి 39 శాతానికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి బిరేన్  ప్రకటించారు. అలాగే వివిధ పథకాల ద్వారా హింసాకాండలో ప్రభావితమైన నిర్వాసితులకు సాయం చేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment