రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ భారత అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుండి ఈ అవార్డును అందుకున్న మొదటి రచయిత ఆయనే కావడం విశేషం.  ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయిత కూడా.

New Update
Vinod Kumar Shukla

ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు అరుదైన గౌరవం దక్కింది. శనివారం  ఆయన 59వభారత అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. ప్రముఖ కథకురాలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన జరిగిన జ్ఞానపీఠ ఎంపిక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .హిందీ సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన అద్భుతమైన కృషికి గాను ఈ గౌరవాన్ని ఆయనకు ప్రదానం చేస్తున్నామని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.  

Also read :  ఆన్‌లైన్ గేమింగ్‌ వెబ్‌సైట్లపై డీబీజీఐ ఉక్కుపాదం.. 2400 అకౌంట్లు ఫ్రీజ్

ఛత్తీస్‌గఢ్ నుండి మొదటి రచయిత

కాగా  ఛత్తీస్‌గఢ్ (chhattisgarh) నుండి ఈ అవార్డును అందుకున్న మొదటి రచయిత ఆయనే కావడం విశేషం.  ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా. ఆయనకు అవార్డుతో పాటు ఆయనకు రూ. 11 లక్షల నగదు బహుమతి, హిందూ విద్యా దేవత సరస్వతి కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రం అందజేస్తారు.  శుక్లా 1999లో తన  దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతి థి అనే  పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.  1961లో స్థాపించబడిన జ్ఞానపీఠ్ అవార్డును మలయాళ కవి జి. శంకర కురుప్‌కు 1965లో ఒడక్కుఝల్ అనే కవితా సంకలనానికి అందుకున్నారు. ఇది కేవలం భారతీయ రచయితలకు మాత్రమే ఇవ్వబడుతుంది.

Also read :  ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

Also read :  బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌ మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

ఇండియా ఫ్రాన్స్ నుంచి 26 రఫెల్ మెరైన్ యుద్ధ నౌకల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.63,000 కోట్ల డీల్‌కు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఏప్రిల్ చివరిలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మోహరించనున్నారు.

New Update
raffile fighter gets

raffile fighter gets Photograph: (raffile fighter gets)

ఇండియా ఫ్రాన్స్ నుంచి మరోసారి రఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈసారి 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల భారత నావికాదళంలో చేరనున్నాయి. యుద్ధ విమానాల కొనుగోలుకు అనుమతి ఇస్తూ ఒప్పందాన్ని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ ఒప్పందంలో 22 సింగిల్-సీటర్, 4 ట్విన్-సీటర్ రాఫెల్ మెరైన్ జెట్‌లు ఉన్నాయి. వీటి కోసం భారత్ రూ.63,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్  ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో చేసుకోనుంది.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

ఏప్రిల్ చివరిలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను భారతదేశ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఒప్పందంపై సంతకం చేసిన 5 సంవత్సరాల తర్వాత రాఫెల్ M జెట్‌ల డెలివరీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు భారతదేశంలో మొట్టమొదటిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన INS విక్రాంత్‌లో మోహరించబడతాయి. ప్రస్తుతం నేవీ MiG-29K విమానాలతో పనిచేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇప్పటికే అంబాలా, హషిమారా ఎయిర్ బేస్‌లో 36 రాఫెల్ జెట్లు ఉన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment