/rtv/media/media_files/2026/05/14/bjp-2026-05-14-12-05-41.jpg)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తారు. తన పార్టీ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో బెనర్జీ స్వయంగా న్యాయవాదిగా వాదనలు వినిపించనున్నారు. ఒక లాయర్గా నేను ఈ కేసును పోరాడుతున్నానని ఆమె ధర్మాసనానికి స్పష్టం చేశారు.
ఆమె కేసు విచారణకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. కోల్కతా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో, చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరుపుతోంది.
207 సీట్లను గెలుచుకుని
కాగా మే 4న విడుదలైన ఫలితాల్లో బిజెపి 294 స్థానాలకు గాను 207 సీట్లను గెలుచుకుని ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. దీనితో 15 ఏళ్ల తృణమూల్ పాలన ముగిసింది. ఆ ఎన్నికల్లో TMC కేవలం 80 సీట్లకే పరిమితమైంది. మే 9న సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Kolkata | Former West Bengal Chief Minister and TMC chief Mamata Banerjee, wearing a lawyer's court, arrives at the Calcutta High Court to appear before Chief Justice HC Sujoy Pal, in connection with the post-poll violence PIL case. She is expected to raise questions on… pic.twitter.com/8u9bTwrZfI
— ANI (@ANI) May 14, 2026
Follow Us