Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు

మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదని ఓ రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అవయవాలు అమ్మి అప్పు తీర్చుకుటానని బోర్డు పట్టుకొని రోడ్డెక్కాడు. సతీశ్ తన కిడ్నీలు 75వేలు, కాలేయాన్ని 90వేలు, కళ్లు 25,000లకు అమ్మి అప్పు తీరుస్తానని చెబుతున్నారు.

New Update
organs of farmers

organs of farmers

మహరాష్ట్రలో ఓ రైతు తన అప్పులు తీర్చుకోవడానికి వినూత్న రీతిలో రోడ్డెక్కాడు. పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ ఓ ప్లకార్డు పట్టుకొని నిరసన ప్రదర్శించాడు. మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అదోలి గ్రామానికి చెందిన సతీశ్‌ ఐదోలు వ్యవసాయంలో నష్టపోయాడు. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంపై వినూతన్నంగా నిరసన తెలిపాడు. ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నెరవేర్చలేదని ఆరోపించాడు. 

Also read : Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

రైతుల అవయవాలు కొనండని రాసిన బోర్డును మెడకు తగిలించుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన కిడ్నీలను రూ.75,000కు, కాలేయాన్ని రూ. 90,000కు, కళ్లు రూ. 25,000కు అమ్ముతానని అందులో రాసుకున్నాడు ఆ రైతు. అయితే రైతు సతీశ్‌ వినూత్న నిరసన అక్కడున్న వారిని ఆకట్టుకున్నది. సతీశ్ నిరసన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్‌ అయ్యింది. రైతు రుణమాఫీ పై మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతు సతీశ్ మండిపడ్డాడు. అతనికి ఉన్న అప్పులు తీర్చడానికి తన కుటుంబ సభ్యుల అవయవాలు కూడా అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు. రైతులకు రుణ మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సతీశ్‌ కోరాడు. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక లేఖ రాశాడు. దాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశాడు. 

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment