అమూల్ నెయ్యిపై తప్పుడు ప్రచారం చేసినందుకు.. ట్విట్టర్ యూజర్లపై ఫిర్యాదు

శ్రీవారి లడ్డూలో అమూల్ నెయ్యి ఉపయోగించారని ఏడు వేర్వేరు అకౌంట్ల నుంచి ట్విట్టర్‌లో తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై అమూల్ మండిపడుతూ.. ఏడుగురిపై గుజరాత్‌తో కేసు పెట్టింది. ఒక్కసారి కూడా తిరుపతి లడ్డూ తయారీకి తాము నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. 

New Update
amul dairy issue

శ్రీవారి లడ్డూలో కల్తీపై ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తిరుపతి లడ్డూలో అమూల్ సంస్థకు చెందిన నెయ్యిని ఉపయోగించారని ట్విట్టర్‌లో ప్రచారం జరిగింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై అమూల్ మండిపడుతూ.. ట్విట్టర్ యూజర్లపై కేసు పెట్టింది. అమూల్ కంపెనీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఏడుగురిపై గుజరాత్‌లో అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో సంస్థ ఫిర్యాదు చేసింది. ఏడు వేర్వేరు అకౌంట్ల నుంచి ట్విట్టర్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు పలు సెక్షన్ల కింద పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.  

నాణ్యతలో అమూల్ బెస్ట్..

అమూల్ బ్రాండ్‌తో లింక్ అయిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. తిరుపతి లడ్డూ తయారీకి అమూల్ కంపెనీకి చెందిన నెయ్యిని ఇప్పటివరకు సరఫరా చేయలేదని జీసీఎంఎంఎఫ్ స్పష్టం చేసింది. అమూల్ ప్రొడక్ట్స్ అన్ని నాణ్యతలో బెస్ట్ అని, కల్తీ నెయ్యిని కస్టమర్లకు విక్రయించడం లేదని తెలిపింది. మొత్తం 36 లక్షల కుటుంబాలు అమూల్‌లో వర్క్ చేస్తున్నారని.. ఇలా తప్పుడు సమాచారం ఇస్తే వారి జీవనోపాధి మీద ప్రభావం పడుతుందని కంపెనీ తెలిపింది. పూర్తిగా తెలుసుకోకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే ఇలాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుందని అమూల్ వెల్లడించింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment