AAP: ఆప్‌కు బిగ్ షాక్‌.. సిసోడియా, జైన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్!

ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్. ఆప్ కీలక నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు పాఠశాల గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

New Update
delhi aap

Delhi school scam President green signal for FIR on Sisodia, Satyendra Jain

AAP: ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆప్ కీలక నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  పాఠశాల గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలిసిందే. 

ప్రభుత్వ పాఠశాలల్లో కుంభకోణం..

ఈ మేరకు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పబ్లిక్‌ వర్క్స్ డిపార్టుమెంట్ 2400 తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(CVC) 2020 ఫిబ్రవరి 17న నివేదిక విడుదల చేసింది. దీంతో 2022లో ఢిల్లీ గవర్నమెంట్ విజిలెన్స్ డైరెక్టరేట్‌ ఈ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తుకు సిఫారసు చేస్తూ ప్రధాన కార్యదర్శికి నివేదికను అందించింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రులుగా ఉన్న  సిసోడియా, జైన్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం. 

Also Read : యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?

మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. కాగా సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్నాడు. హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత రెండు కేసులలో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు నాయకులు బెయిల్‌పై బయట ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.

Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్‌

2021-22 మద్యం పాలసీని అమలు చేయడంలో ఆయన అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా సిసోడియా మద్యం పాలసీని రూపొందించారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రచారం చేయడానికి మద్యం వ్యాపారుల నుండి రూ.100 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సిసోడియా జైలుకు వెళ్లారు.

Also read :  ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ఢిల్లీ ప్రభుత్వంలో మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 30 మే 2022న అరెస్టు చేసింది. సత్యేంద్ర జైన్ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రముఖ నాయకుడు, ఢిల్లీ ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖల మంత్రి. 2015-2016లో నకిలీ కంపెనీల ద్వారా సత్యేంద్ర జైన్ రూ.16.39 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. అరెస్టు తర్వాత అతన్ని తీహార్ జైలుకు పంపారు. 

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴IPL 2025 DC vs RR Live Score: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
DC vs RR Live Score IPL 2025

DC vs RR Live Score IPL 2025

RR vs DC : టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

dc-vs-rr
dc-vs-rr

 

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

  • Apr 16, 2025 20:23 IST

    DC VS RR : 10 ఓవర్లు కంప్లీట్.. 2 వికెట్ల నష్టానికి ఢిల్లీ స్కోర్ ఎంతంటే?

    రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తయ్యాయి. 2 వికెట్ల నష్టానికి డీసీ 76 పరుగులు సాధించింది. క్రీజ్‌లో పొరెల్ 40* , కేఎల్ రాహుల్ 27* ఉన్నారు.

    Abishek Porel AND KL RAHUL
    Abishek Porel AND KL RAHUL Photograph: (Abishek Porel AND KL RAHUL)

     



  • Apr 16, 2025 20:10 IST

    IPL 2025 DC vs RR Live Score: 50 దాటిన ఢిల్లీ స్కోరు

    రాహుల్ (15), అభిషేక్ పొరెల్ (32) పరుగులతో క్రీజులో ఉన్నారు.  
    7 ఓవర్లకు స్కోరు 56/2



  • Apr 16, 2025 19:55 IST

    IPL 2025 DC vs RR Live Score: డిల్లీ రెండో వికెట్ డౌన్.. కరుణ్‌ నాయర్ డకౌట్.. 


    సందీప్ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లో కరుణ్‌ నాయర్ రనౌట్‌



  • Apr 16, 2025 19:45 IST

    IPL 2025 DC vs RR Live Score: డిల్లీ ఫస్ట్ వికెట్ డౌన్

    జేక్ ఫ్రేజర్ (9) ఔట్.. 



  • Apr 16, 2025 19:40 IST

    IPL 2025 DC vs RR Live Score: తుషార్ దేశ్‌పాండే వేసిన  రెండో ఓవర్లో 23 పరుగులు 

    వరుస బౌండరీలతో హోరెత్తించిన పొరెల్
    జేక్ ఫ్రేజర్(9), అభిషేక్ పొరెల్(24)
    స్కోరు 33/0



  • Apr 16, 2025 19:38 IST

    IPL 2025 DC vs RR Live Score: జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లోనే పది పరుగులు 

    జేక్ ఫ్రేజర్(9), అభిషేక్ పొరెల్(1)



  • Apr 16, 2025 19:20 IST

    IPL 2025 DC vs RR Live Score



  • Apr 16, 2025 19:19 IST

    IPL 2025 DC vs RR Live Score



  • Apr 16, 2025 19:08 IST

    RR vs DC : టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

    ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

    dc-vs-rr
    dc-vs-rr

     



  • Apr 16, 2025 14:19 IST

    ఇక 40 ఏళ్లు వస్తే ఉద్యోగం ఊస్ట్.. షాకింగ్ ప్రకటన!

    ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో లేఆఫ్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.దీనిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్ పాండే స్పందించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO
    Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO

     



  • Apr 16, 2025 14:18 IST

    ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    సైన్‌బోర్డులకు ఉర్దూ భాష వాడటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఓ మున్సిపల్ కౌన్సిల్‌కు ఉర్దూ భాషలో రాసిన సైన్‌ బోర్డుకు ఉండటాన్ని సమర్ధించింది.కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను తిరస్కరించింది. ఉర్దూ ఇండియాలోనే పుట్టిందని తెలిపింది.

    Supreme Court
    Supreme Court

     



  • Apr 16, 2025 13:16 IST

    ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

    ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను హైదరాబాద్ వ్యాపారి సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

    list



  • Apr 16, 2025 11:28 IST

    రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

    రీల్స్ పిచ్చితో ఓ మహిళ గంగానదిలో కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం గంగానదిలో దిగగా.. కాలు జారింది. ఇదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుని మృతి చెందింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు.

    viral video up
    viral video up

     



  • Apr 16, 2025 09:34 IST

    హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

    హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

    ed



  • Apr 16, 2025 09:20 IST

    షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.

    sheikh Hasina
    sheikh Hasina

     



  • Apr 16, 2025 09:19 IST

    ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

    ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

    EC



  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment