Nashik TCS: నాసిక్ TCS మతమార్పిడి కేసులో బిగ్‌ ట్విస్ట్.. సిట్‌ విచారణలో విదేశీ లింకులు బట్టబయలు

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో గల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో చోటుచేసుకున్న మతమార్పిడి యత్నాల కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. SIT కోర్టుకు సమర్పించిన వివరాలు ఈ కుట్రలోని అంతర్జాతీయ కోణాలను బహిర్గతం చేశాయి.

New Update
tcs

Nashik TCS conversion

Nashik TCS: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో గల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో చోటుచేసుకున్న మతమార్పిడి(TCS Nashik Religious Conversion) యత్నాల కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోర్టుకు సమర్పించిన వివరాలు ఈ కుట్రలోని అంతర్జాతీయ కోణాలను బహిర్గతం చేశాయి.

కుట్ర నేపథ్యం.ఆరోపణలు

నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు వ్యవస్థీకృత పద్ధతిలో ప్రయత్నించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. బాధితురాలికి బలవంతంగా బుర్కా ధరించడం, నమాజ్ చేయడం వంటి మతపరమైన ఆచారాలను నేర్పడమే కాకుండా, ఆమె మొబైల్ ఫోన్‌లో కొన్ని మతపరమైన లెర్నింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అంతేకాకుండా, బాధితురాలి అసలు పేరును మార్చి 'హానియా'గా పెట్టేందుకు నిందితులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి నిందితురాలి ఫోన్‌లో పలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ లింకులను సిట్ అధికారులు గుర్తించారు.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

అంతర్జాతీయ సంబంధాలు

ఈ వ్యవహారానికి మాలేగావ్‌తో పాటు మలేషియాతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలికి మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తామనే సాకుతో ఆమెను విదేశాలకు తరలించేందుకు ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి నిదా ఖాన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరో నిందితుడు డానిష్ షేక్, బాధితురాలికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు మరియు ఇతర కీలక పత్రాలను తన ఆధీనంలోకి తీసుకుని, వాటిని మాలేగావ్‌లోని ఒక బృందానికి అందజేయాలని చూసినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు.

Also Read: ’కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

నిందితుల పరారీ, కోర్టు విచారణ

ప్రస్తుతం ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉన్నారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. నిందితురాలి పరారీ దృష్ట్యా కోర్టు ఆమెకు ఎలాంటి మధ్యంతర ఉపశమనం లేదా బెయిల్ మంజూరు చేయలేదు.

అయితే, నిదా ఖాన్ తరపు న్యాయవాది ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. మహారాష్ట్రలో మతమార్పిడికి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం లేదని, కేవలం మతపరమైన భావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో కేసులు పెట్టడం సరికాదని వాదించారు. ఒకే అంశంపై పలువురి పేర్లతో 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. నిదా ఖాన్ పట్టుబడితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.