Delhi Election Results : ప్రచారంలో ఆ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. ఇంతకీ అతను గెలిచాడా.. ఓడాడా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి గెలుపోదారు. ఆప్ అభ్యర్థి అవధ్ ఓజాను ఆయన 23 వేల 280 ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఈయన పాదాలకు నమస్కరించారు.

New Update
ravinder singh

ravinder singh

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ  అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి గెలుపోదారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి అవధ్ ఓజాను ఆయన 23 వేల 280 ఓట్ల తేడాతో ఓడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2013 నుండి పట్పర్‌గంజ్ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది.  2020 అసెంబ్లీ ఎన్నికల్లో మనీష్ సిసోడియా ఇక్కడి నుంచి గెలుపోందారు. ఈ ఎన్నికల్లో సిసోడియాకు రవీంద్ర నేగి గట్టి పోటీ ఇచ్చి కేవలం 2% ఓట్ల తేడాతో ఓడిపోయారు.  

అయితే ఈ ఎన్నికల్లో  సిసోడియా తన సీటును పట్పర్‌గంజ్  నుంచి కాకుండా జంగ్‌పురా నుండి పోటీ చేశారు. కానీ అక్కడ కూడా ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి పట్పర్‌గంజ్ స్థానంలో బీజేపీ , ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది. చివరికి రవీంద్ర సింగ్ నేగి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఓ బహిరంగ సభలో రవీంద్ర సింగ్ నేగి పాదాలకు నమస్కరించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 

ఉత్తరాఖండ్ మూలానికి చెందిన

ఎన్నికల ర్యాలీలో రవీంద్ర సింగ్ నేగి ముందుగా ప్రధాని మోడీ పాదాలను తాకగా, మోడీ తిరిగి ఆయనను ఆపి మూడుసార్లు స్వయంగా ఆయన పాదాలను తాకారు. రవీంద్ర సింగ్ నేగి ప్రస్తుతం పట్పర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వినోద్ నగర్ నుండి ఎంసీడీ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈయన ఉత్తరాఖండ్ మూలానికి చెందినవాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 25 లక్షల మంది ప్రజలు ఢిల్లీలో నివసిస్తున్నారు. వారిలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రవీంద్ర సింగ్ నేగి వయస్సు 48 సంవత్సరాలు. అతను గ్రాడ్యుయేట్. అతని నికర ఆస్తి విలువ రూ. 1.8 కోట్లు కాగా అప్పు రూ. 16 లక్షలుగా ఉంది.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

మందెస్తే దేనికైనా సిద్ధం అంటారు మందుబాబులు. తాజాగా అదే జరిగింది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందేసి ఏకంగా పెద్ద సాహసమే చేశాడు. తన సైకిల్‌కి రోడ్ రోలర్‌కి రబ్బరుసూప్‌ని కట్టి లాగాడు. ఎంత తొక్కిన సైకిల్ కదల్లేదు, రోడ్ రోలరు కదల్లేదు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

New Update
drunk man pulled road roller with his bicycle

drunk man pulled road roller with his bicycle

మందు బాబులం మేము మందు బాబులం.. మందేస్తే మాకు మేమె మహారాజులం. ఈ సాంగ్ వినగానే మందుబాబుల తఢాకా ఏంటో అర్థం అయిపోతుంది. నిజంగా మందుతాగే వారిని ఆ సమయంలో ఎవ్వరూ ఆపలేరు. తమకు తామే రాజులుగా ఊహించుకుంటారు. ఆ టైంలో భూమ్మిద కాకుండా.. ఆకాశంలో తేలుతున్నట్లు ఫీలౌతుంటారు. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

తమను ఎవరూ ఏమీ చేయలేరని కాలర్ ఎగరేస్తారు. కొండలనైనా పిండిచేసేంత బలం తమకు ఉందని భుజాలు గజాలు చేస్తుంటారు. కొందరైతే నడి రోడ్డుమీదే రచ్చ రచ్చ చేస్తారు. ఎదురుగా వస్తున్న వాహనాలను అడ్డుకుని బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తుంటారు. తాగిన మందు దిగేంత వరకు నింగి నేల కానరాదు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మందుబాబు డేరింగ్

 

ఫుల్‌గా మందేసిన ఓ వ్యక్తి ఏకంగా సైకిల్‌తో పెద్ద ప్రయత్నమే చేశాడు. తన సైకిల్‌కు రోడ్ రోలకు పెద్ద రబ్బరుసూప్ కట్టి దాన్ని లాగడం స్టార్ట్ చేశాడు. ముందుగా ఆ మందుబాబు సైకిల్ ఎక్కి తొక్కడం ప్రారంభించాడు. వెనుకున్న రోడ్ రోలర్ ఎప్పటికీ ముందుకు  రాకపోవడంతో మరింత గట్టిగానే ప్రయత్నించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. మనోడు వేసిన మందు పేరు కనుక్కోండిరా జర.. మనం కూడా ట్రై చేద్దాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment