/rtv/media/media_files/2026/02/07/fotojet-9-2026-02-07-20-06-44.jpg)
Maoists surrender
Chhattisgarh : వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ జిల్లా బస్తర్ డివిజన్లో 51మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో శనివారం నాడు లొంగిపోయారు. బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్పూర్లో బస్తర్ పాండుమ్ 2026 ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్షా రాయపూర్ వచ్చిన రోజునే ఇంత పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
#Chhattisgarh के बस्तर मंडल के बीजापुर और सुकमा जिलों में आज 51 माओवादियों ने आत्मसमर्पण किया।
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) February 7, 2026
इन माओवादियों पर 1 करोड़ 61 लाख रुपये का इनाम घोषित था। बीजापुर जिले में 30 माओवादी कार्यकर्ताओं ने हिंसा का मार्ग त्याग कर समाज की मुख्यधारा में लौटने का निर्णय लिया। pic.twitter.com/UWYxq8687M
కాగా, ఈ సందర్భంగా బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ మాట్లాడుతూ బీజాపూర్ జిల్లాలో 20 మంది మహిళా క్యాడర్తో సహా 30 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. అలాగే సుక్మా జిల్లాలో మరో 21 మంది లొంగిపోయారని ఎస్పీ సుందరరాజ్ తెలిపారు. వీరిలో 14 మంది మహిళా క్యాడర్ ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి కార్డెక్స్ వైర్లు, జెలటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.50వేల తక్షణ సాయం అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పునరావాస చర్యలతో స్వచ్ఛందంగా వీరంతా లొంగిపోయినట్టు చెప్పారు. కాగా, తక్కిన మావోయిస్టు క్యాడర్ కూడా హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రత, గౌరవంగా జీవించేందుకు అవసరమైన పునరావసం కల్పిస్తామని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
Follow Us